ఉచిత బస్సు పథకం అమలు వేళ కొత్త కష్టాలు...!!
APSRTC పై భారం పెరుగుతోంది. ఒక వైపు ఇంధన పొదుపు పైన అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఈ సమయంలోనే పెరిగిన డీజిల్ ఛార్జీలు.. ఉచిత బస్సు పథకం సంస్థ పైన భారం పెంచుతున్నాయి. పెరిగిన డీజిల్ ధరల భారంతో సామాన్యులు ఆర్టీసీ బస్సుల వైపు చూస్తున్నారు. ఇదే సమయంలో స్త్రీ శక్తి పథకం కింద ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల పైన పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగటం లేదు. దీంతో.. ఆర్టీసీకి మోయలేని భారంగా మారుతోంది.
పెరిగిన పెట్రో ఉత్పత్తుల ధరలు ఆర్టీసీ భారంగా మారుతున్నాయి. దీని ద్వారా రోజుకు అదనంగా రూ.25 లక్షల వ్యయాన్ని భరించాల్సిన భారాన్ని ఎదుర్కొంటోంది. నెలకు రూ.7.5 కోట్లుగానూ సంవత్సరానికి రూ.90 కోట్లుగా ఉంది. RTC బస్సులు ఏపీలో రోజుకు సుమారు 40 లక్షల కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తాయి. సగటున RTC బస్సులు లీటరు డీజిల్కు 5.2 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయి. RTC ప్రతిరోజూ దాదాపు 7.7 లక్షల లీటర్ల డీజిల్ను వినియోగిస్తుంది. ఆర్టీసీకి లీటరుకు రూ.4 వరకు తక్కువ ధరకు అంటే రాయితీ రేటుకే దీనికి డీజిల్ అందిస్తున్నారు. అయితే, పెరిగిన ధరలు కేవలం రిటైల్ బల్క్ అమ్మకాల పైనా ప్రభావం చూపుతున్నాయి. దీంతో, ఆర్టీసీ నిత్యం వినియోగించే 7.70 లక్షల లీటర్ల డీజిల్ ధర లీటరుకు రూ.3.30 చొప్పున పెరగడంతోదాదాపు రూ.25 లక్షల అదనపు ఆర్థిక భారం పడింది.















Click it and Unblock the Notifications