అరకు కాఫీకి పడిపోయారు: లక్ష మొక్క నాటిన ప్రధాని మోడీ(పిక్చర్స్)
విశాఖపట్నం: అరకు కాఫీ రుచి చూసిన ప్రధాని నరేంద్ర మోడీ దానికి అభిమానిగా మారిపోయారు. ఆహా! ఇదేమి రుచి అంటూ ముచ్చటపడ్డారు. శనివారం విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఐఎఫ్ఆర్ విలేజిని ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా జిసిసి ఏర్పాటు చేసిన కాఫీ స్టాల్ను సందర్శించారు. అక్కడ కాఫీ రుచి చూసిన ప్రధాని మోడీ.. దీని గురించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అడిగి తెలుసుకున్నారు. కాఫీ రుచి చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా అరకు కాఫీ విశిష్టత గురించి ప్రధానికి ముఖ్యమంత్రి వివరించారు. అనంతరం వివిధ రాష్ట్రాలకు చెందిన హస్తకళలు, చేతి వృత్తుల కళాకారులతో ప్రధాని కొద్దిసేపు ముచ్చటించారు.
హస్త కళలకు మార్కెట్లో డిమాండ్ ఎలా ఉంది.. మీకు ఏ మేరకు గిట్టుబాటు అవుతుందని ప్రధాని వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నావికాదళం స్టాళ్లను సందర్శించారు. అక్కడ భారత నౌకాదళం ఆయుధ సంపత్తిని వివరిస్తూ ఏర్పాటు చేసిన పోస్టర్ను ప్రధాని ఆసక్తిగా తిలకించారు. భారత నావికాదళ ఆయుధ సంపత్తిని వివరిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శన గురించి అడ్మిరల్ ఆర్కె ధావన్ ఆయనకు వివరించారు.
మోడీ నాటిన మొక్కతో లక్ష పూర్తి
యుద్ధనౌకల సమీక్ష అనంతరం ప్రధాని మోదీ తూర్పునౌకాదళంలో మొక్క నాటారు. దాంతో తూర్పునౌకాదళ ప్రాంగణంలో మొక్కల సంఖ్య లక్షకు చేరింది. హుద్హుద్ సమయంలో తూర్పునౌకాదళంలో 50వేలకు పైగా వృక్షాలు కుప్పకూలాయి. ఈ నేపథ్యంలో వాటిస్థానే లక్ష మొక్కలు నాటాలని తూర్పునౌకాదళం నిర్ణయించింది. ఇప్పటికే 99,999 మొక్కలు నాటగా ప్రధాని పర్యటనకు గుర్తుగా ఆయనతో మొక్క నాటించి లక్ష లక్ష్యాన్ని పూర్తిచేశారు.

ఐఎఫ్ఆర్లో ప్రధాని
అరకు కాఫీ రుచి చూసిన ప్రధాని నరేంద్ర మోడీ దానికి అభిమానిగా మారిపోయారు. ఆహా! ఇదేమి రుచి అంటూ ముచ్చటపడ్డారు.

ఐఎఫ్ఆర్లో ప్రధాని
శనివారం విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఐఎఫ్ఆర్ విలేజిని ఆయన సందర్శించారు.

ఐఎఫ్ఆర్లో ప్రధాని
ఈ సందర్భంగా జిసిసి ఏర్పాటు చేసిన కాఫీ స్టాల్ను సందర్శించారు. అక్కడ కాఫీ రుచి చూసిన ప్రధాని మోడీ.. దీని గురించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అడిగి తెలుసుకున్నారు. కాఫీ రుచి చాలా బాగుందని మెచ్చుకున్నారు.

ఐఎఫ్ఆర్లో ప్రధాని
ఈ సందర్భంగా అరకు కాఫీ విశిష్టత గురించి ప్రధానికి ముఖ్యమంత్రి వివరించారు. అనంతరం వివిధ రాష్ట్రాలకు చెందిన హస్తకళలు, చేతి వృత్తుల కళాకారులతో ప్రధాని కొద్దిసేపు ముచ్చటించారు.

ఐఎఫ్ఆర్లో ప్రధాని
హస్త కళలకు మార్కెట్లో డిమాండ్ ఎలా ఉంది.. మీకు ఏ మేరకు గిట్టుబాటు అవుతుందని ప్రధాని వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నావికాదళం స్టాళ్లను సందర్శించారు.

ఐఎఫ్ఆర్లో ప్రధాని
అక్కడ భారత నౌకాదళం ఆయుధ సంపత్తిని వివరిస్తూ ఏర్పాటు చేసిన పోస్టర్ను ప్రధాని ఆసక్తిగా తిలకించారు. భారత నావికాదళ ఆయుధ సంపత్తిని వివరిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శన గురించి అడ్మిరల్ ఆర్కె ధావన్ ఆయనకు వివరించారు.

ఐఎఫ్ఆర్లో ప్రధాని
భారత్కు సముద్రం వైపు నుంచి ముప్పురాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నదీ తెలియజేశారు. ఆ తరువాత భారత్ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించిన కృషిని తెలియజేస్తూ ఏర్పాటు చేసిన నమూనా ప్రదర్శనలను తిలకించారు.

ఐఎఫ్ఆర్లో ప్రధాని
క్షిపణులు బ్రహ్మోస్, అస్తద్రాన్, టార్పెడోలు, నీటిలో ఉన్న వాటిని గుర్తించే పరికరాలు, నావికదళం ఉపయోగిస్తున్న హెలీకాప్టర్లు తదితర వాటిపై ఏర్పాటు చేసిన ప్రదర్శనలు తిలకించారు. నావికాదళంలో ఏయే ఆయుధాలను ఉపయోగిస్తున్నదీ, కొత్త రకాలను గురించి తెలిపారు.

ఐఎఫ్ఆర్లో ప్రధాని
తూర్పు తీర ప్రాంతం, బంగాళాఖాతం ప్రాంతంపై నిఘా ఏ విధంగా ఉంచుతున్నదీ భారత నావికాదళ అధిపతి ఆర్కే ధావన్ ప్రధానికి వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ అడ్మిరల్ సతీష్ సోనీతోపాటు పలువురు నావికాదళ అధికారులు పాల్గొన్నారు.

ఐఎఫ్ఆర్లో ప్రధాని
యుద్ధనౌకల సమీక్ష అనంతరం ప్రధాని మోడీ తూర్పునౌకాదళంలో మొక్క నాటారు. దాంతో తూర్పునౌకాదళ ప్రాంగణంలో మొక్కల సంఖ్య లక్షకు చేరింది.












Click it and Unblock the Notifications