హోదా కోసం ఢిల్లీలో ఆత్మహత్య : శ్రీకాకుళం వాసిగా గుర్తింపు: సీయం దీక్ష వేళ..!
ఏపికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండు రోజుల క్రితం నంద్యాల కోర్టు ఆవరణ లొ ఓ న్యాయవాది ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ఏపికి హోదా ఇవ్వాలని.. విభజన హామీ లు అమలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి దీక్ష చేస్తున్న సమయంలో ఢిల్లీలోనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది.
హోదా కోసం ఆత్మహత్య..
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం కింతలికి చెందిన దవళ అర్జున్ రావు ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్నా రు. ఏపీ భవన్ సమీపంలోని జశ్వంత్ సింగ్ రోడ్డు ఫుట్ పాత్పై ఉదయం ఏడు గంటల ప్రాంతంలో అర్జున్ మృతదేహా న్ని పోలీసులు గుర్తించారు. అతని దగ్గర నుంచి సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. నోట్ తెలుగులో రాసి ఉం దని పోలీసులు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యకు పాల్పడినట్టు లేఖలో అర్జున్ పేర్కొన్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పార్లమంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్ వద్ద మృతదేహం పరిధిలో ఈ ఘటన జరిగింది. మృతునికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

దీక్షా స్థలిలో సంతాపం..
ఏపి కి ప్రత్యేక హోదా..విభజన డిమాండ్ల సాధన కోసం ఏపి భవన్ వద్ద ముఖ్యమంత్రి దీక్ష చేస్తున్నారు. ఏపి నుండే కాకుండా పలువురు జాతీయ నేతలు దీక్షా స్థలి వద్దకు వచ్చి మద్దతు ప్రకటిస్తున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ దీక్షా స్థలి వద్దకు వచ్చి ముఖ్యమంత్రికి మద్దతు ప్రకటించారు. అదే సమయంలో అర్జున్ ఆత్మహత్యకు సంబంధించిన సమాచారం తెలియవచ్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు దీక్షా స్థలిలోనే సంతాపం ప్రకటించి... మౌనం పాటించారు. ఎన్సీపీ అగ్రనేత శరద్ పవార్ , దీక్షా స్థలి తో ఉన్న ఇతర నేతలు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications