రేపు అనంతపురం పర్యటనకు వైఎస్ జగన్: స్కూలు పిల్లలు సహా..!
అనంతపురం: రాష్ట్రంలో మరో సంక్షేమ పథకం అమల్లోకి రానుంది. పాఠశాల విద్యార్థులకు కూడా వర్తింపజేసిన పథకం- వైఎస్సార్ కంటి వెలుగు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురంలో గురువారం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లను పూర్తి చేసింది. స్థానిక ప్రభుత్వ కళాశాల గ్రౌండ్స్ లో వైఎస్సార్ కంటి వెలుగు పథకం ప్రారంభించిన అనంతరం వైఎస్ జగన్ అక్కడే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పాఠశాల విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారు.
12 లక్షల మందికి పైగా..
మొత్తం ఆరు దశల్లో ఈ పథకాన్ని నిర్వహిస్తారు. తొలి రెండు దశలను విద్యార్థులకు పరిమితం చేశారు. రాష్ట్రంలో సుమారు 75 లక్షలమందికి పైగా పాఠశాల విద్యార్థులు ఉన్నట్లు ఓ అంచనా. తొలి, రెండు దశల్లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రస్తుతం ఒకటి నుంచి పదో తరగతి చదువుకుంటున్న ఆ విద్యార్థులందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తారు. చివరి నాలుగు దశల్లో సామాన్య ప్రజల కోసం కంటి వైద్య పరీక్షా శిబిరాలను నిర్వహిస్తారు. అంధత్వ నివారణ కింద 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు దశలవారీగా వారందరికీ పాఠశాలల్లోనే కంటి పరీక్షలను చేపడతారు. కంటి చూపులో లోపాలు ఉన్న విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలను అందజేస్తారు.

డీఎంహెచ్ఓలకు బాధ్యత..
రెండో దశలో సామన్య ప్రజల కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో శిబిరాలను నిర్వహిస్తారు. దీనికోసం ప్రభుత్వం 560 కోట్ల రూపాయలను కేటాయించిన విషయం తెలిసిందే. వచ్చే మూడేళ్లలో అంటే.. 2022 నాటికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు పూర్తి చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహించాల్సిన బాధ్యతలను జిల్లా వైద్య, ఆరోగ్య అధికారులకు అప్పగించారు. వారి పర్యవేక్షణలోనే వైఎస్సార్ కంటి వెలుగు పథకం కొనసాగుతుంది. కలెక్టర్ కు తమ తుది నివేదికను అందజేయాల్సి ఉంటుంది. దీనికి అవసరమైన విధి విధానాలను వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇదివరకే నిర్ధారించింది.
-
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications