రాజీనామాలు చేస్తేనే: అశోక్ బాబు హెచ్చరిక

విభజనను సమర్థించే వారికి రాజకీయ భవిష్యత్ ఉండదని హెచ్చరించారు.రాయలసీమ అభివృద్ధికి కేంద్ర చేయూతనివ్వాలని కోరారు. ప్రజలతో కలిసి ఉద్యమంలోకి రాకపోతే రాజకీయ నాయకుల భవిష్యత్ కు శుభం కార్డు పడుతుందన్నారు. సమైక్యాంధ్రలోనే 2014 ఎన్నికలు జరుగుతాయని తేల్చిచెప్పారు. కేబినేట్ నోట్ తిరస్కరించి కేంద్ర మంత్రులు బయటకు రావాలన్నారు.
ఈనెల 24న కొంత మంది సీమాంధ్ర ఎంపీల రాజీనామాలతో కాంగ్రెస్పై మరింత ఒత్తిడి పెరుగుతుందని అశోక్బాబు అన్నారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. యుపిఎ ప్రభుత్వమే సంక్షోభంలో ఉన్నప్పుడు తెలంగాణ నోట్ ఎలా ప్రవేశపెడతారని ఆయన ప్రశ్నించారు. రాయలసీమ అభివృద్ధికి కేంద్ర చేయూత ఇవ్వాలని ఆయన కోరారు.
సమైక్యాంధ్ర ఉద్యమ సెగ కాంగ్రెసు అధిష్టానాన్ని తాకాలంటే సీమాంధ్ర ప్రజలంతా ఢిల్లీ వేదికగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని మంత్రులు ఏరాసు ప్రతాప రెడ్డి, టిజి వెంకటేష్ అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఢిల్లీ బయలుదేరిన వారు సోమవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు అధిష్టానం తెలంగాణ ప్రక్రియను ముందుకు తీసుకుని వెళ్తే అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ఓడిస్తామని వారు చెప్పారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications