అశోక్ గజపతి రాజుకు చేదు అనుభవం, ఎయిర్ ఇండియా సిబ్బంది షాక్!
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ నేత, విమానయాన శాఖ మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీ నుంచి విశాఖపట్టణం వచ్చేందుకు ఆయన ఎయిర్ ఇండియా విమానం ఎక్కేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లారు.
విశాఖపట్నం చేరుకున్న అనంతరం తన లగేజ్ లేకపోవడంతో ఆయన ఆశ్చర్యపోయారు. కాగా, ఢిల్లీలో ఆయన లగేజీని తనిఖీ చేసిన విమానాశ్రయ సిబ్బంది, దానిని అక్కడే వదిలేసినట్టుగా తెలుస్తోంది.

కాగా, ఇటీవలి వరకు అశోక్ గజపతి రాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా పని చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల నేపథ్యంలో టీడీపీ కేంద్రం నుంచి బయటకు వచ్చింది.












Click it and Unblock the Notifications