వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజన: అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ నుండి ఆరా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Assembly sessions may start December first week
హైదరాబాద్: డిసెంబర్ తొలివారంలో అసెంబ్లీ సమావేశాల కోసం కసరత్తు చేస్తున్నారు. విభజన ప్రక్రియ వేగంగా జరిగిపోతున్న నేపథ్యంలో ఇటు రాష్ట్రంలో శాసన సభను సమావేశపరిచేందుకు అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయం సమాయత్తమవుతోంది. సమాచారం మేరకు కేంద్ర కేబినెట్ సమావేశం జరిగిన మూడు రోజులకే అసెంబ్లీని సమావేశపరచే అవకాశాలున్నాయంటున్నారు. అదే అయితే డిసెంబర్ మొదటి వారంలో సమావేశాలు ప్రారంభం కావొచ్చంటున్నారు.

మరోవైపు డిసెంబర్ రెండోవారం ఆరంభంలో అసెంబ్లీ భేటీ ఉంటుందని మరికొందరు చెబుతున్నారు. అప్పుడే రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాన్ని కోరుతూ రాష్ట్రపతి భవన్ నుంచి అసెంబ్లీ కార్యదర్శికి నోట్ వస్తుందంటున్నారు. అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ బుధవారం శాసనసభ పరిసరాలను తనిఖీ చేశారు. అసెంబ్లీ అవరణలో పాములు తిరుగుతున్నాయన్న కలకలం రేగడంతో ఆయా ప్రాంతాలను కూడా పరిశీలించారు.

పాములు సంచరించకుండా తగు చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సిబ్బందిని స్పీకర్ ఆదేశించారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత అసెంబ్లీ సిబ్బంది ఒక పాము పిల్లను పట్టుకున్నారు. అసెంబ్లీ ఆవరణలో తనిఖీ పూర్తయిన తర్వాత సందర్శకులు, మీడియా లాంజ్‌లను స్పీకర్ పరిశీలించారు. ఆ తర్వాత తన కార్యాలయంలో అసెంబ్లీ కార్యాదర్శి రాజాసదారాంతో సమావేశాల ఏర్పాటు గురించి, భ ద్రతా చర్యలపై సమీక్షించారు. సమావేశాలకు హాజరయ్యేందుకు వీలుగా అధికారులు, మీడియా ప్రతినిధులకు జారీ చేసిన పాసులు తదితర వివరాలను తెలుసుకున్నారు. మొత్తం 943 మందికి పాసులు జారీ చేసినట్లు రాజాసదారాం వివరించారు.

రాష్ట్ర విభజనపై తాజా పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయంటూ స్పీకర్ మనోహర్ వద్ద కొందరు ప్రజాప్రతినిధులు ఆరా తీస్తున్నారు.

విభజన అంశంపై చర్చించేందుకు వీలుగా శాసనసభా సమావేశాలను అవసరమైతే అర్ధరాత్రి వరకూ నిర్వహించాలన్న యోచనలో శాసనసభా వర్గాలు ఉన్నాయి. సహజంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ శాసనసభా సమావేశాలు జరుగుతాయి. అయితే రాష్ట్రపతి కార్యాలయం నుంచి వచ్చే కాలపరిమితిని అనుసరించి ఈ సమయంపై శాసనసభా వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకూ అవసరమైతే అర్ధరాత్రి వరకూ శాసనసభ్యుల అభిప్రాయాలను సేకరించాలన్న యోచనలో అసెంబ్లీ వర్గాలు ఉన్నాయట.

English summary
The Andhra Pradesh Assembly sessions may start from first week of the December.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X