MLA ల షాకింగ్ నిర్ణయం, ఇక అలాంటి క్యారెక్టర్లు వేయం
పల్నాటి పౌరుషం అసెంబ్లీ వేదికపై మరోసారి గర్జించడానికి సిద్ధమవుతోంది. అయితే ఈసారి నవ్వులు పంచే 'కామెడీ'గా కాదు.. రొమ్మిరిచి నిలబడే 'గాంభీర్యం'తో! గతంలో తమ నటనతో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లను సైతం కడుపుబ్బ నవ్వించిన పల్నాడు ఎమ్మెల్యేలు.. ఈసారి మాత్రం రూటు మార్చారు. "మేము పల్నాటి పులులం.. మాకు కామెడీ సెట్ అవ్వదు" అంటూ తెగేసి చెప్పడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
గతేడాది జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పల్నాడు ప్రాంత ఎమ్మెల్యేలు వేసిన స్కిట్లు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించాయి. నియోజకవర్గాల్లో పవర్ఫుల్ లీడర్లుగా పేరున్న నాయకులు స్టేజీపై హాస్యాన్ని పండించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, ఈసారి వారు తమ ఇమేజ్ విషయంలో పక్కాగా ఉన్నారు. "వెండితెర మీదైనా, వేదిక మీదైనా పల్నాటి పులి గర్జించాలే తప్ప.. వెక్కిరింతలకు తావివ్వకూడదు" అని వారు నిర్ణయించుకున్నారు. తమ పౌరుషానికి తగ్గట్టుగా పవర్ఫుల్ పాత్రలనే వేస్తామని భీష్మించుకోవడంతో నిర్వాహకులు డైలమాలో పడ్డారు.

చీఫ్ విప్ సవాల్.. స్క్రిప్టులో మార్పులు!
ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఈ వేడుకలకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేల రోజువారీ తిప్పలు.. ముఖ్యంగా కార్యకర్తల నుంచి వచ్చే తిరుమల శ్రీవారి దర్శన సిఫారసు లేఖల ఒత్తిడిని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని ఆయన కొన్ని సరదా స్కిట్లు సిద్ధం చేశారు. కానీ, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు వంటి నేతలు ఈ 'కామెడీ' స్క్రిప్టులకు ససేమిరా అన్నారు. ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న భయంతో పల్నాటి పులుల్లాంటి గంభీరమైన పాత్రలే కావాలని కోరడంతో, ఆంజనేయులు ఇప్పుడు కొత్త నటుల కోసం వెతుకులాట ప్రారంభించాల్సి వచ్చింది.
గతంలో నవ్వుల పూత.. ఇప్పుడు పౌరుషాల వేట!
గతేడాది ఆంజనేయులు ఎమ్మెల్యేగా నటిస్తుండగా, జూలకంటి బ్రహ్మారెడ్డి, అరవిందబాబులు కార్యకర్తల పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి అందరినీ అలరించారు. ఆ వీడియోలు యూట్యూబ్లో ఓ ట్రెండ్ సెట్టర్గా నిలిచాయి. ఆ అంచనాలు ఈసారి మరింత పెరిగాయి. అయితే నేతలు మాత్రం తమ పౌరుషం తగ్గకూడదని పట్టుబడుతుండటంతో, మార్చి 6న స్టేజీపై ఏ రకమైన ప్రదర్శనలు ఉండబోతున్నాయి? వారు కోరుకున్నట్టుగా 'పులుల్లాంటి' గంభీర పాత్రల్లో కనిపిస్తారా? లేక చివరకు హాస్యానికే మొగ్గు చూపుతారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
-
కరీంనగర్ సీపీపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! -
IND Vs ENG: సెమీస్ వర్షంలో కొట్టుకుపోతే, ఫైనల్ చేరేదెవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
విజయ్ విడాకుల రచ్చ వేళ.. పెళ్లిపై త్రిష షాకింగ్ కామెంట్స్ !! -
T20 World Cup ఫైనల్ వీరి మధ్యే..! తేల్చేసిన ఏఐ ప్లాట్ ఫామ్స్..! -
Free Bus ఏపీలో ప్రారంభమైన కొత్త పథకం, వారికి కూడా ఇంద్రధనస్సు -
ఏపీలో మహిళా దినోత్సవ కానుక-ఈ 3 పథకాల ప్రారంభం..! -
సీఎం రేవంత్ దంపతులను కలిసిన నటి రష్మిక.. -
Ind Vs Eng: సెమీస్ లో స్టార్ బ్యాటర్ పై వేటు, డేంజెరస్ హిట్టర్ ఇన్ - మార్పుల వెనుక..!! -
ఖాళీ కడుపుతో ఉసిరి పౌడర్ కలిపిన గోరువెచ్చని నీటిని తీసుకోండి చాలు..!! -
అమెరికాలో సంవత్సరం ఆడి సంచలనం సృష్టించిన తెలుగు సినిమా -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ ఉద్యోగాల మెరిట్ లిస్ట్ ఎప్పుడంటే ? -
దేశవ్యాప్తంగా "అన్నదానం".. "విరోష్" జంట బిగ్ డిసిషన్..! -
హోలీ ఎప్పుడు? మార్చి 3 లేదా 4నా - స్కూల్స్.. బ్యాంకుల సెలవుపై తాజా నిర్ణయం..!! -
ఖమేనీ కేవలం నేత కాదు.. కోట్ల మంది మతగురువు: ప్రధాని మోదీకి ఒవైసీ డిమాండ్ -
T20 World cup: విండీస్ పై ఆడే టీమిండియా ఇదే..! రింకూ సస్పెన్స్ కు తెర..!














Click it and Unblock the Notifications