మోసం: ఏపీ బీజేపీ నేత కందుల కొడుకుపై మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు
కడప: ఏపీలో బీజేపీ నాయకుడు కందుల శివానంద రెడ్డి కుమారుడు ఓబుల్ రెడ్డి పైన ఓ మహిళా ప్రొఫెసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఓబుల్ రెడ్డి తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడని వాసవీ రెడ్డి అనే అసిస్టెంట్ ప్రొపెసర్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
బుధవారం ఉదయం వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితురాలు.. తనను ఓబుల్ రెడ్డి మాయమాటలతో మోసం చేసి, పెళ్లి చేసుకుని ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో తాను శివానందరెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలో పని చేశానని చెప్పారు.

ఆ సమయంలో ఓబుల్ రెడ్డితో పరిచయం ఏర్పడిందన్నారు. తనను ప్రేమించానని చెప్పిన ఓబుల్ రెడ్డి.. ఇప్పుడు మోసం చేస్తున్నాడని చెప్పారు. వాసవి ఫిర్యాదుపై కందుల ఓబుల్ రెడ్డి స్పందించటవలసి ఉంది. కేసు నమోదు చేసుకున్నామని, దర్యాఫ్తు చేస్తామని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications