చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు కనుసన్నల్లోనే రోజాపై దాడి: వాసిరెడ్డి పద్మ

By Pratap
|
Google Oneindia TeluguNews

 Attack on Roja: Vasireddy Padma demands CM's apology
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కనుసన్నల్లోనే తమ పార్టీ శాసనసభ్యురాలు, సినీ నటిపై రోజాపై నగరిలో దాడి జరిగిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. రోజాపై జరిగిన దాడిని ఆమె శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు.

రోజాకు చంద్రబాబు నాయుడు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రోజాపై దాడి తెలుగుదేశం పార్టీ అరాచకాలకు పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారని, ఇలాగే వ్యవహరిస్తే పోలీసు, న్యాయవ్యవస్థలు ఎందుకని ఆమె ప్రశ్నించారు.

దేవతలకు హారతి ఇస్తుండగా శనివారం ఉదయం నగరిలో శాసనసభ్యురాలు రోజాపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడికి నిరసనగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు నగరిలో ఆందోళనకు దిగారు. పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించారు.

తనపై జరిగిన దాడికి రోజా తీవ్రంగా ప్రతిస్పందించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దు కృష్ణనాయుడిపై ఆమె విరుచుకుపడ్డారు. ముద్దుకృష్ణమ నాయుడి ప్రోద్బలంతోనే తనపై దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.

English summary

 YSR Congress party leader Vasireddy Padma blamed Chandrababu Naidu for attack on Roja. Nagari YSR Congress MLA and actress Roja has expressed anguish at police for attack on her at Jathara. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X