వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంజాయి స్మగ్లర్లు: జగన్ పార్టీ నేతలపై అయ్యన్న సంచలనం

ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. గంజాయి రవాణాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని అన్నారు.

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. గంజాయి రవాణాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని అన్నారు.

విశాఖపట్నం జిల్లాలోని ఏటిగైరంపేట నుంచి పాకలపాడు మీదుగా తుని, వడ్డాది, బుచ్చయ్యపేటల మీదుగా గంజాయి రవాణా జరుగుతున్నట్లు వివరించారు. పీడీ యాక్టు ప్రయోగిస్తేనే గంజాయి రవాణా నియంత్రణ సాధ్యమవుతుందని అన్నారు.

ayyanna patrudu fires at YSRCP leaders in ganja supply issue

గంజాయి రవాణా జరుగుతున్న విషయం అన్ని విభాగాలకు తెలుసని, ముఖ్యంగా పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులకు కూడా తెలుసని అయ్యన్నపాత్రుడు ఇటీవల వ్యాఖ్యానించారు. అంతేగాక, గంజాయి రవాణాకు సహకరిస్తున్న పెద్దలపైనా పీడీ యాక్ట్ అమలు చేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు.

ఏపీ సంతోషం కోసమే..

సమస్యలు లేని సంతోష ఆంధ్రప్రదేశ్‌ను చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఎంపీ కేశినేని నాని అన్నారు. పాదయాత్ర ద్వారా ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ఉద్దేశమన్నారు. విజయవాడ రూరల్ గొల్లపూడి గ్రామంలో ఎంపీ కేశినేని నాని, మంత్రి దేవినేని ఉమ ఇంటింటికీ తెలుగు దేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని, ఎంపీ కేశినేని ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.

English summary
Andhra Pradesh minister Ayyanna Patrudu fired at YSRCP leaders in ganja supply issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X