కదులుతున్న రైలు నుండి కిందపడిన యువతి: 6 గంటల నరకయాతన
ఏలూరు: కదులుతున్న రైలులో నుండి ఓ యువతి జారి బురదలో పడిపోయింది. సుమారు 6 గంటలకు పైగా బురదలోనే సహయం కోసం ఎదురు చూసింది. రైల్వే గ్యాంగ్మెన్ ఆమెను చూడడంతో ఆమె ప్రాణాలు దక్కించుకొంది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో ఆదివారం నాడు చోటు చేసుకొంది.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన రాజేశ్వరి విజయవాడ నుండి పూరీ ఎక్స్ప్రెస్లో స్వంత ఊరికి బయలుదేరింది.

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు- గుమ్ములూరు వద్ద ఆమె రైలు తలుపువద్ద నిలబడింది. ప్రమాదవశాత్తు రైలు నుండి కాలుజారి కిందపడిపోయింది. అయితే రాజేశ్వరి కిందపడిన ప్రాంతంలో బురద ఎక్కువగా ఉంది. దీంతో ఆమె ఆ బురదలోనే కూరుకుపోయింది.
ఉదయం 9 గంటల సమయంలో ఆ యువతి రైలు నుండి కిందపడిపోయింది. దీంతో బురదలో సుమారు 6 గంటలకు పైగా ఉంది. అయితే రైల్వే గ్యాంగ్ మెన్ పట్టాలను తనిఖీ చేస్తూ ఆ దారిగుండా ప్రయాణం చేస్తున్నాడు.
అయితే బురదలో కూరుకుపోయిన ఆ యువతిని అతను చూశారు. ఇతరుల సహయంతో ఆమెను బురద నుండి బయటకు తీశారు. బాధితురాలికి సపర్యలు చేశారు.అంబులెన్స్ను పిలిపించి ఆసుపత్రికి తరలించారు. .ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతోంది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications