అన్ని ప్రాంతాలవారూ అడుగుతున్నారు: పోటీపై బాలకృష్ణ
కర్నూలు: వచ్చే ఎన్నికల్లో తమ ప్రాంతం నుంచి పోటీ చేయాలని అన్ని ప్రాంతాలవాళ్లూ అడుగుతున్నారని నందమూరి హీరో, తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకృష్ణ చెప్పారు. పార్టీ అధిష్టానంతో చర్చించిన తర్వాత ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు.
లెజెండ్ సినిమా విజయోత్సవ యాత్రలో భాగంగా ఆయన శుక్రవారంనాడు కర్నూలు వచ్చారు. ఆయనకు కర్నూలులో అభిమానులు ఘనస్వాగతం పలికారు. మౌర్య ఇన్ హోటల్ నుంచి లెజెండ్ సినిమా ప్రదర్శిస్తున్న ఆనంద్ థియేటర్ వరకు ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులతో దారులు క్రిక్కిరిసిపోయాయి. లెజెండ్ సినిమాలోని డైలాగులు చెబుతూ బాలకృష్ణ అబిమానులను అలరించారు. ఆయన కొద్ది రోజులుగా లెజెండ్ విజయోత్సవ యాత్రలో భాగంగా వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాననే విషయాన్ని ఆయన కచ్చితంగానే చెబుతున్నారు. అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని మాత్రం వెల్లడించడం లేదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికే ఆ విషయాన్ని వదిలేశాననే పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నారు.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications