బాలాపూర్ లడ్డు9.5లక్షలు, అమీర్పేటలో 10.8లక్షలు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రాముఖ్యతను సంపాదించుకున్న బాలాపూర్ లడ్డూ వేలంపాట ముగిసింది. బాలాపూర్ లడ్డూ 9 లక్షల యాభై వేలు పలికింది. బాలాపూర్ లడ్డూ కోసం ప్రముఖులు, రాజకీయ నాయకులు పోటీ పడ్డారు. మొత్తం 24మంది ప్రముఖులు వేలంలో పాల్గొన్నారు. సింగిరెడ్డి జయేందర్ రెడ్డి ఈ లడ్డూను తొమ్మిదిన్నర లక్షలకు దక్కించుకున్నారు. పోయిన ఏడాది కంటే ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ 24వేలు అధికంగా పలికింది.
కాగా, బాలాపూర్ లడ్డూ వేలంపాటలో ముస్లింలు సైతం పాల్గొంటారు. తొలిసారి 1994లో బాలాపూర్ లడ్డూను వేలం వేయడం ప్రారంభించారు. ఆ ఏడాది కేవలం రూ.450కి లడ్డూ అమ్ముడుపోయింది. అయితే, ఏడాదికేడాదికీ లడ్డూ వేలం పెరుగుతూనే ఉంది. పోయిన ఏడాది హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి రూ. 9.26 లక్షలకు లడ్డూను వేలంపాటలో సొంతం చేసుకున్నారు.

లడ్డూను దక్కించుకున్న అనంతరం సింగిరెడ్డి జయేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తొలిసారి 1994లో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్న వారు సంతోషంగా ఉన్నారని, ఆర్థికంగా ఎదిగారని, గత ఏడాది లడ్డూను దక్కించుకున్న తీగల కృష్ణా రెడ్డి ఎమ్మెల్యే కావాలని కోరుకున్నారని, ఆయన కోరికను గణనాథుడు తీర్చారని, తాను కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశ్యంతో లడ్డూను కొన్నానని చెప్పారు.
ఖైరతాబాద్ గణేషుడిపై పూలవర్షం
ఖైరతాబాద్లో గణపతి వద్ద భక్తుల కోలాహం అధికంగా ఉంది. నిమజ్జనం దృష్ట్యా మహాగణపతిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఉదయం నుంచే తరలిస్తున్నారు. ఖైరతాబాద్ గణేషుడిపై హెలికాఫ్టర్ ద్వారా పూలవర్షం కురిపించనున్నారు. అందుకోసం కమిటీ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు.
రూ.10.8 లక్షలు పలికిన అమీర్ పేట లడ్డూ
హైదరాబాదులోని అమీర్ పేటలో గణేషుడి లడ్డూ రూ.10.8 లక్షలు పలికింది. ఈ లడ్డూను రియల్ ఎస్టేట్ వ్యాపారి బాబు వేలంలో దక్కించుకున్నారు. నిమజ్జనం ప్రశాంతంగా సాగుతుందని డీజీపీ అనురాగ్ శర్మ చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించామన్నారు. నిమజ్జనం త్వరగా పూర్తయ్యేలా చూస్తామన్నారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications