ఒంగోలు ఎంపీ సీటుపై బాలినేని రాజీ ఫార్ములా - జగన్ అంగీకరించేనా...!!
ఏపీలో ఎన్నికల వేళ వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ఇంఛార్జ్ ల మార్పు వ్యవహారం పార్టీలో సంచలనంగా మారుతోంది. సీట్లు దక్కని కొందరు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. సీనియర్లు తమ సిఫార్సులను పట్టించుకోకపోవటం పైన ఆగ్రహంతో ఉన్నారు. ఒంగోలు ఎంపీ విషయంలో మాజీ మంత్రి బాలినేని కొంత కాలంగా సిట్టింగ్ ఎంపీ మాగుంటకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ వివాదం వేళ బాలినేని కొత్త ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.
మారుతున్న లెక్కలు: ఒంగోలు ఎంపీ మాగుంట స్థానంలో మరొకరిని బరిలోకి దించాలనేది సీఎం జగన్ ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికి ఇంఛార్జ్ ల మార్పులో భాగంగా వైసీపీ ఆరు జాబితాలను ప్రకటించింది. అందులో ఒంగోలు సీటు పైన క్లారిటీ ఇవ్వలేదు. ఒంగోలు ఎంపీగా మాగుంటను మార్చటం పైన మాజీ మంత్రి బాలినేని అంగీకరించటం లేదు.

మార్చాలని భావిస్తే స్థానికంగా ఉన్న వారికి సీటు ఇవ్వాలని డిమాండ్ చేసారు. దీని పైన పార్టీ సర్వేలు చేయించింది. ఎంపీ సీటు మాగుంట కోసం తాను కోరారనని, ఎంపీ సీటు గురించి ఎవరికీ పట్టనప్పుడు తనకు మాత్రం ఎందుకని బాలినేని వ్యాఖ్యానించారు. పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాను వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేసారు.
ఎంపీగా బాలినేని..?: అయితే, తాజాగా చెవిరెడ్డి భాస్కర రెడ్డిని ఒంగోలు ఎంపీగా బరిలో దించాలని పార్టీ నిర్ణయంగా తెలుస్తోంది. అదే సమయంలో ఒంగోలుతో పాటుగా జిల్లాలో పలు నియోజకవర్గాలకు సమన్వయకర్తగా ప్రకటన చేసింది. దీని పైన బాలినేని మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసారు. చెవిరెడ్డికి ఎంపీ సీటు ఇవ్వటాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు.
ఇక..ఎన్నికలు సమీపిస్తున్న వేళ బాలినేని నిర్ణయం ఏంటనేది రాజకీయంగా చర్చకు కారణమవుతోంది. ఇదే సమయంలో బాలినేని కొత్త ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. ఒంగోలు ఎంపీగా తానే పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారని సమాచారం. దీని ద్వారా ఇతరులకు అవకాశం లేకుండా చేయాలనేది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. పార్టీ ముఖ్య నేతల ద్వారా ఈ ప్రతిపాదన సీఎం వద్దకు పంపినట్లు సమాచారం.
జగన్ నిర్ణయంపై ఉత్కంఠ: ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్దిగా ఎవరు పోటీ చేస్తారనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదని చెబుతున్నారు. ఇప్పుడు బాలినేని తానే స్వయంగా పోటీకి దిగుతానని చెప్పటం తో సీఎం జగన్ ఇందుకు అంగీకరిస్తారా లేదా అనేది జిల్లాలో ఆసక్తి కర అంశంగా మారుతోంది. బాలినేనికి ఎంపీ సీటు కేటాయిస్తే ఎమ్మెల్యేగా మరో ఇద్దరి పేర్లు తెర మీదకు వస్తున్నాయి.
ఇద్దరూ ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతల వారసులే. వీరికి సీటు ఇచ్చే అంశంలో జగన్ సుముఖంగా లేరని తెలుస్తోంది. ఈ సమయంలో బాలినేని తాజా ప్రతిపాదన పైన ఇప్పుడు సీఎం ఏ రకంగా స్పందిస్తారు.. బాలినేని ఎంపీగా పోటీ చేస్తే ఒంగోలు ఎమ్మెల్యేగా ఎవరికి అవకాశం ఇస్తారనేది రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications