కాపు రిజర్వేషన్లు: మాట నిలుపుకోండంటూ జగన్కు బీసీ సంఘాల మద్దతు
అమరావతి: కాపులకు రిజర్వేషన్ల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీసీ సంఘాలు స్వాగతించాయి. జగన్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ జీ వెంకటేశ్వరరావు అన్నారు.
అంతేగాక, జగన్ తన వ్యాఖ్యలకు జగన్ కట్టుబడి ఉండాలని కోరారు. విజయవాడలో వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. జగన్ వ్యాఖ్యలపై తెలుగుదేశం మంత్రులు, నాయకులు చేస్తున్న విమర్శలను తాము ఖండిస్తున్నామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో బీసీలు జగన్ కు మద్దతుగా నిలుస్తామని తెలిపారు.

కాగా, తాను చేయలేని పనులను చేస్తానంటూ చెప్పలేనని, రిజర్వేషన్లు 50 శాతం దాటరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నందున కాపు రిజర్వేషన్లపై హామీ ఇవ్వలేనని జగన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, బీసీలను నష్టం జరుగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించే అంశానికి తాను మద్దతిస్తానని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications