కాపు రిజర్వేషన్లు: మాట నిలుపుకోండంటూ జగన్కు బీసీ సంఘాల మద్దతు
అమరావతి: కాపులకు రిజర్వేషన్ల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీసీ సంఘాలు స్వాగతించాయి. జగన్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ జీ వెంకటేశ్వరరావు అన్నారు.
అంతేగాక, జగన్ తన వ్యాఖ్యలకు జగన్ కట్టుబడి ఉండాలని కోరారు. విజయవాడలో వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. జగన్ వ్యాఖ్యలపై తెలుగుదేశం మంత్రులు, నాయకులు చేస్తున్న విమర్శలను తాము ఖండిస్తున్నామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో బీసీలు జగన్ కు మద్దతుగా నిలుస్తామని తెలిపారు.

కాగా, తాను చేయలేని పనులను చేస్తానంటూ చెప్పలేనని, రిజర్వేషన్లు 50 శాతం దాటరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నందున కాపు రిజర్వేషన్లపై హామీ ఇవ్వలేనని జగన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, బీసీలను నష్టం జరుగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించే అంశానికి తాను మద్దతిస్తానని స్పష్టం చేశారు.
-
పుట్టా మహేష్ పై తేల్చేసిన చంద్రబాబు, పార్టీ వీళ్లను మోయాలా..!! -
జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీ పై ప్రభుత్వం కీలక నిర్ణయం...!! -
కొత్త ఇళ్ల పై ప్రభుత్వం గుడ్ న్యూస్- అర్హుల జాబితా సిద్దం, పంపిణీ ఇలా..!! -
ఆ అదృష్టం - బాధ్యత నాదే, ఉగాది వేళ చంద్రబాబు కీలక ప్రకటన..!! -
పంచె కట్టులో మెరిసిన జగన్, సతీ సమేతంగా ఉగాది వేడుకలు -
రైతుబజార్ కూరలు ఇక ఇంటికే, ఇలా చేస్తే చాలు- అక్కడి ధరలకే అన్ని ఉత్పత్తులు..!! -
బాలినేని స్థానం ప్రకాశంలో ఆయనకే, తేల్చి చెప్పిన జగన్ - ఇక నుంచి..!! -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే!












Click it and Unblock the Notifications