రాజధాని ఎక్స్ప్రెస్లో బెంగళూరు యువతి కిడ్నాప్: ఛేదించిన సికింద్రాబాద్ పోలీసులు
హైదరాబాద్: బెంగళూరులో రాజధాని ఎక్స్ప్రెస్ రైలులో కిడ్నాప్కు గురైన యువతిని సికింద్రాబాద్ రైల్వే పోలీసు కాపాడారు. బెంగళూరుకు చెందిన ఓ యువతిని గురువారం రాత్రి కిడ్నాప్ చేసి రాజధాని ఎక్స్ప్రెస్లో తీసుకువెళ్ళుతున్నారని సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు బెంగళూరు నుంచి సమాచారం అందింది.
దీంతో అప్రమత్తమైన నగర పోలీసులు ట్రైన్ ఎస్కార్ట్ను అలర్ట్ చేసి రైలు సికింద్రాబాద్కు చేరుకునే సమయంలో హెచ్1 ఏసీ బోగీ నుంచి యువతిని రక్షించారు. కిడ్నాపర్ నిజాంను అరెస్టు చేశారు. కేసును రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

కడప: జిల్లాలోని రాజంపేట మండలం బోయిన్పల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మతి చెందారు. కారు, లారీ ఢీకొనడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది తిరుపతి నుంచి వస్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది.
ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications