ఇవి చేస్తే మళ్లీ గెలిచేస్తాం..! కూటమి నేతలకు చంద్రబాబు కీలక సూచనలు..!

ఏపీలో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. మరో మూడున్నరేళ్లలో సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఎలా సన్నద్ధం కావాలి, గతేడాది ఫీట్ ను ఎలా రిపీట్ చేయాలన్న దానిపై ఇవాళ మరోసారి కూటమి నేతలకు చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ లో దిశానిర్దేశం చేశారు. జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ ప్రచారం, పెన్షన్లు, విద్యుత్ సమర్థ నిర్వహణ వంటి అంశాలపై నేతలతో టెలీ కాన్ఫరెన్స్ లో చర్చించారు.

ఇవాళ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ప్రభుత్వం చేసే సంక్షేమం-అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలన్నారు. చేసిన పనులను ప్రజలకు చెప్పుకున్నప్పుడే... ప్రజల్లో ప్రభుత్వం పట్ల పాజిటివిటి పెరుగుతుందన్నారు. ప్రజలతో మమేకం కావడమే కాదు... ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధులు, నేతలు కేడరే పార్టీకి ప్రతినిధులని తెలిపారు. పార్టీకి ప్రతినిధుల్లాంటి వారు తమ వ్యవహర శైలితో పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు.

Beyond 2024 Chandrababu s Ambitious Target for NDA Allies in 2029

గత ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచిందని, కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ పేరుతో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తోందని చంద్రబాబు గుర్తుచేశారు. పీక్ లోడ్ లో కరెంట్ కొనుగోలు చేయకుండా.. స్వాపింగ్ విధానాన్ని అనుసరించామన్నారు. దీంతో తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి వచ్చిందన్నారు. సోలార్, విండ్ వంటి సాంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తిపై ఫోకస్ పెట్టినట్లు వివరించారు. సమర్థ పాలనకు.. అసమర్థ పాలనకు ఉన్న తేడాలను ప్రజలకు వివరించాలన్నారు. జనాభాలో 13 శాతం మందికి పెన్షన్ల ద్వారా ఆర్దిక సాయం చేస్తున్నట్లు తెలిపారు.

అతి పెద్దదైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెన్షన్ల నిమిత్తం కేవలం రూ.5500 కోట్లు మాత్రమే ఇస్తున్నారని, ఏపీలోని కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.33 వేల కోట్లకు పైగా నిధుల్ని పెన్షన్ల రూపంలో పంపిణీ చేస్తోందని చంద్రబాబు తెలిపారు. ఆటోడ్రైవర్ల సేవలో పథకం కింద ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ. 15 వేలు ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. జీఎస్టీ సంస్కరణలతో కలిగే లాభాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

Beyond 2024 Chandrababu s Ambitious Target for NDA Allies in 2029

సూపర్ సిక్స్-సూపర్ హిట్ దీన్ని ప్రజలకు చెప్పాలి, ఓనర్ షిప్ తీసుకోవాలని చంద్రబాబు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి పనులు ప్రజలకు తెలిస్తే... ప్రజలు మనవైపే నిలుస్తారన్నారు. ప్రజలు మనవైపు ఉంటే... రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. గత ఎన్నికలకు మించిన స్థాయిలో మళ్లీ విజయం దక్కేలా కూటమి పార్టీలు బలపడాలన్నారు. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలన్నారు. మళ్ళీ ఇదే విజయం దక్కేలా కూటమి పార్టీలు బల పడాలన్నారు. చేసే మంచి..ప్రజలకు తెలియాలన్నారు. సూపర్ సిక్స్ పై ఓనర్ షిప్ తీసుకోవాలన్నారు. ప్రజల్లో నేతలు మంచి పేరు తెచ్చుకోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+