పవన్ ప్రచారం పనిచేసింది: నటులు భానుచందర్, సురేష్
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ టిడిపి, బిజెపి కూటమికి మద్దతు ఇవ్వడం యువత పైన బాగా పని చేస్తోందని ప్రముఖ సినీ నటులు భానుచందర్, శివాజీరాజా, సురేష్లు మంగళవారం అన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో తాము నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి మంచి స్పందన లభించిందని చెప్పారు.
భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున శివాజీ రాజా, సురేష్ తదితరులు ప్రచారం చేశారు. వారు హైదరాబాదులో బిజెపి రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
కేంద్రంలో బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ, రాష్ట్రంలో టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. వారితోనే దేశంలో, రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రజలు కూడా అదే నమ్ముతున్నారన్నారు. సినీ నటుల ప్రచారానికి మంచి స్పందన లభించిందని చెప్పారు.
రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో నడవాలంటే టిడిపి, బిజెపి కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరముందని చెప్పారు. రాజకీయ పార్టీల నేతలు వాడుతున్న సెటిలర్స్ అనే పదం వింటే గుండె రగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని సెటిలర్స్గా కాకుండా సిటిజన్స్గా గుర్తించాలని కోరారు. అవినీతి వల్లనే రాష్ట్రం చాలా వెనుకబడిపోయిందన్నారు.