వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూన్ 6న రాజధానికి భూమి పూజ: నారాయణ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జూన్‌ 6న రాజధాని భూమి పూజ చేస్తారని, శంకుస్థాపన కాదని మంత్రి నారాయణ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ, బోరుపాలెం మధ్యలో 8.5 కిలోమీటర్ల వద్ద ముఖ్యమంత్రి భూమి పూజ చేస్తారని మంత్రి నారాయణ చెప్పారు.

జ్యోతిష్యులు అర్చకులతో మాట్లాడి ముహూర్తం నిర్ణయించామని ఆయన తెలిపారు. భూసేకరణ కింద రాజధానికి భూములు సేకరిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాజధాని విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు.

 Bhoomi Puja on June 6th, says Narayana

అవినీతి సహించేది లేదు: చంద్రబాబు

అవినీతిని సహించేది లేదని, అధికారులు పారదర్శకంగా పని చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం ఏడాది పాలనపై సచివాలయంలో చంద్రబాబు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. పనిలో వేగం పెంచుకోవాలని కలెక్టర్లకు సూచించారు. వడదెబ్బ తగలకుండా గ్రామాల్లో చలివేంద్రాలు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అవసరమైనవారికి మజ్జిగ అందించాలని సూచించారు.

రుణమాఫీ ప్రక్రియను సమర్థంగా పర్యవేక్షించాలని, రైతు సంక్షేమ కార్యక్రమాలపై దృష్టిపెట్టాలని సూచించారు. ఉద్యోగికి బదిలీ అనేది వేధింపు కాకూడదని, మాట వినకుంటే బదిలీ అనేది చివరి అస్త్రం కావాలన్నారు.

English summary
Andhra Pradesh Minister Narayana on Saturday said that the Bhoomi Puja will held on June 6th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X