శిల్ప ఏం చేశారు?, వారి మాటలు నమ్మొద్దు: బ్రహ్మానందరెడ్డి ఆగ్రహం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తెలుగుదేశం పార్టీ నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తెలుగుదేశం పార్టీ నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి నంద్యాలను ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని ఆరోపించారు.
నంద్యాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని, ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. అభివృద్ధి నిరోధకుల మాటలను నమ్మి మోసపోవద్దని ఓటర్లకు ఈ సందర్భంగా ఆయన సూచించారు.

ఉప ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో నంద్యాలలో ఇరు పార్టీల అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ తరపున ఎమ్మెల్యేలు, మంత్రులు నంద్యాలలో పర్యటిస్తుండగా, వైసీపీ కూడా ప్రచారాన్ని జోరుగా సాగిస్తోంది. ఇప్పటికే టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు, ఇటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా నంద్యాలలో పర్యటించి ప్రచారం నిర్వహించారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications