నోరు మెదపని 'జగన్'.. జలయజ్ఞంపై బహిరంగ చర్చకు రా!..: భూమా సవాల్
వైఎస్ హయాంలో జలయజ్ఞంలో తీవ్ర అవినీతి చోటు చేసుకుందన్న భూమా.. దానిపై బహిరంగ చర్చకు రావాలని జగన్ కు సవాల్ విసిరారు.
విజయవాడ: పార్టీ ఫిరాయింపులకు పాల్పడినవారిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ నేత జగన్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేత భూమా నాగిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారి టీఆర్ఎస్లో చేరితే ఇంతవరకు నోరు మెదపని జగన్.. తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.
కర్నూలు జిల్లా దోర్నాలలో నిర్వహించిన రైతు భరోసా యాత్ర సందర్బంగా పార్టీ ఫిరాయింపులపై జగన్ పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ వ్యాఖ్యలను ఖండిస్తూ భూమా మీడియాకు ముందుకు వచ్చారు. కేవలం రైతులను రెచ్చగొట్టడానికే జగన్ రైతు భరోసా యాత్రలు చేస్తున్నారని భూమా ఆరోపించారు.

వైఎస్ హయాంలో జలయజ్ఞంలో తీవ్ర అవినీతి చోటు చేసుకుందన్న భూమా.. దానిపై బహిరంగ చర్చకు రావాలని జగన్ కు సవాల్ విసిరారు. తాను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) ఛైర్మన్ గా ఉన్నప్పుడు అన్ని ఆధారాలను సేకరించానని అన్నారు.
జగన్కు నాయకత్వ లక్షణాలే లేవని ఈ సందర్భంగా భూమా జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. వట్టిసీమ ప్రాజెక్టుతో రాయలసీమ రైతులకు మేలు జరుగుతుంటే.. కేవలం వారిని రెచ్చగొట్టాలన్న ఉద్దేశంతోనే జగన్ రైతుయాత్రలు చేస్తున్నారని భూమా అన్నారు. చంద్రబాబు విజన్ చాలా గొప్పదని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ది దిశగా పయనిస్తోందని భూమా కితాబిచ్చారు.
-
రాజ్యసభలో అమరావతి బిల్లుపై రూటు మార్చిన వైసీపీ, అనూహ్య డిమాండ్..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ












Click it and Unblock the Notifications