విశాఖకు మరిన్ని పెద్ద కంపెనీలు, లక్ష ఐటీ ఉద్యోగాలు: బాబు, లోకేష్ల ఆకాంక్ష!
విశాఖపట్టణం: కాన్డ్యూయెంట్ మంచి కంపెనీ అని, రియల్ టైంలో ఇక్కడ నుంచి అమెరికాకు సేవలు అందించేలా మన ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశంసించారు. గురువారం విశాఖలో పలు కంపెనీలను ఆయన ప్రారంభించారు.
Recommended Video
ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ... పర్యాటక రంగం అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. విశాఖలో 25 వేల నుంచి 30 వేల మంది పర్యాటకులు ఉండేలా హోటళ్ల నిర్మాణం జరిగితే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని సీఎం చెప్పారు.
అనంతరం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. 2019 నాటికి లక్ష ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఐటీ రంగంలో పెద్ద కంపెనీలు ఏపీకి వస్తున్నాయని, కాన్డ్యూయెంట్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ పెద్ద కంపెనీలని తెలిపారు.
కాన్డ్యూయెంట్ కంపెనీలో 92 వేల మంది పనిచేస్తున్నారని, పెద్ద నగరాలతో పోటీ పడే సత్తా విశాఖకు ఉందని, ఇలాంటి పెద్ద కంపెనీలు విశాఖకు మరిన్ని రావాలని మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు.