జూన్22 ఏం జరగబోతుంది?: విశాఖలో బిగ్ పొలిటికల్ ఫైట్.. వైసీపీ వర్సెస్ టీడీపీ!
పైపెచ్చు రెండు పార్టీలు ఒకేరోజు భారీ జన సమీకరణతో సభలు, ధర్నాలు నిర్వహిస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం లేకపోలేదు.
విశాఖపట్నం: టీడీపీని ఎలాగైనా దోషిగా నిలబెట్టాలని వైసీపీ చేస్తున్న వరుస ప్రయత్నాలన్ని తొలి నుంచి విఫలమవుతూనే వస్తున్నాయి. కాల్ మనీ, ఓటుకు నోటు, బలవంతపు భూసేకరణ, రెవెన్యూ అధికారిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి ఉదంతాల్లో ఈ విషయం స్పష్టమైంది. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడంలో ఆ పార్టీ పూర్తిగా తేలిపోతూ వస్తోంది.
ఇన్నాళ్ల తర్వాత మళ్లీ విశాఖ భూఆక్రమణల కేసు ఇప్పుడు వైసీపీకి మరో అస్త్రంగా దొరికింది. ఈసారైనా ప్రభుత్వాన్ని జనం ముందు దోషిగా నిలబెట్టి.. పార్టీ మైలేజీ పెంచుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇందుకోసం జూన్ 22న విశాఖలో మహాధర్నా చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. కానీ అదే రోజు టీడీపీ సైతం మహాసంకల్ప కార్యక్రమానికి సిద్దమవుతుండటంతో.. ఎవరిది పైచేయి అవుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మహాధర్నా సక్సెస్ అవుతుందా?
ప్రత్యేక హోదా ఉద్యమం కోసం జగన్ గతంలో విశాఖకు వచ్చిన సమయంలో పోలీసులు ఆయన్ను అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా జగన్కు ప్రతికూల వాతావరణమే కనిపిస్తుండటంతో మహాధర్నా ఎంతమేర సక్సెస్ అవుతుందనేది అనుమానమే. అసలు ఆయన్ను ఎయిర్ పోర్టు నుంచి నగరంలోకి అడుగుపెట్టానిస్తారా? అన్నది అనుమానమే. మరోవైపు వైసీపీ మాత్రం మహాధర్నా కోసం భారీ జన సమీకరణకు సిద్దమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వైసీపీకి చెక్ పెట్టేందుకు టీడీపీ మహాసంకల్పం:
అదే సమయంలో అటు టీడీపీ సైతం వైసీపీ ధర్నాను దెబ్బతీసేందుకు భారీ ఎత్తున మహాసంకల్ప కార్యక్రమం చేపట్టబోతుంది. సహజంగానే దీనికి పోలీసుల మద్దతు ఉంటుంది కాబట్టి.. అదే రోజు తలపెట్టిన జగన్ ధర్నాకు అనుమతినివ్వడం కష్టమే. పైపెచ్చు రెండు పార్టీలు ఒకేరోజు భారీ జన సమీకరణతో సభలు, ధర్నాలు నిర్వహిస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం లేకపోలేదు. దీంతో జూన్ 22న విశాఖ నగరంలో భారీ పొలిటికల్ ఫైట్ తప్పదన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

వైసీపీ అసత్యాలను ఎండగట్టేందుకే:
విశాఖపట్నం సౌత్ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ దీనిపై స్పందించారు. ప్రజల్లో అసత్యాలు ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్న వైసీపీ తీరుకు చెక్ పెట్టడానికే మహాసంకల్ప సభను చేపట్టినట్లు తెలిపారు. మరోవైపు టీడీపీ వైఖరి మీద వైసీపీ నేతలు మండిపడుతున్నారు. కేవలం భూఆక్రమణల వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే.. టీడీపీ మహాసంకల్ప సభకు సిద్దమవుతోందని వారు ఆరోపిస్తున్నారు.

రాజకీయాంశంగా మార్చేస్తున్నారు
భూములను కోల్పోయిన సామాన్యులంతా తీవ్ర ఆవేదనలో ఉంటే.. దీన్నో పొలిటికల్ అంశంగా మార్చేసి రెండు పార్టీలు తగాదా పడుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. భూఆక్రమణల వ్యవహారంలో బాధితులకు న్యాయం జరిగేలా చూడాల్సింది పోయి.. తమ పొలిటికల్ మైలేజీ కోసం ఇలా బాహాబాహికి దిగడాన్ని వారు తప్పుపడుతున్నారు. కేవలం ఒక్కరోజు కార్యక్రమాలతో సరిపెట్టి.. ప్రజలకు ఏం మేలు చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications