పవన్ కల్యాణ్కు బిగ్ షాక్..?
టికెట్ల పంచాయితీ టీడీపీ , జనసేన పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించిన దగ్గర నుంచి రాష్ట్రంలో విభిన్న వాతావరణం కనిపిస్తోంది. ఈ రెండు పార్టీల్లో అసమ్మతి ఒక్కసారిగా బయటపడింది. టీడీపీ , జనసేన పార్టీల్లో టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారు. ముఖ్యంగా టీడీపీలో అసంతృప్తి జ్వాలలు ఎక్కువయ్యాయి.
బండారు సత్యానారాయణ మూర్తి, నాగేశ్వర రావు ,బోడే ప్రసాద్ , వర్మ గంటా శ్రీనివాసరావు , గండి బాబ్జీ , పాసర్ల ప్రసాద్, జవహర్ వంటి సీనియర్ నేతలకు టికెట్ల దక్కని పరిస్థితి. వీరంతా కూడా బహిరంగంగానే టీడీపీ అధిష్టానంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వీరిలో కొంతమంది టీడీపీకి రాజీనామా కూడా చేశారు. ఇక పవన్ కల్యాణ్ జనసేన పార్టీలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

పార్టీ కీలక నేత బొలిశెట్టి సత్యనారాయణ టికెట్ దక్కకపోవడంతో కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్డం సమయాన్ని, ధనాన్ని వెచ్చించాను, నాకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు, కనీసం పిలిచి మాట్లాడలేదంటూ తన బాధను బయటపెట్టారు. ఇదిలా ఉంటే తాజాగా జనసేన పార్టీకి మరో షాక్ తగిలింది. మరో కీలక నేత జనసేనకు రాజీనామా చేశారు. జనసేన అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

టికెట్ కోసం ప్రయత్నించి..నిరాశ చెందానని ఇక జనసేన నుంచి బయటకు రావడమే ఉత్తమం అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నానని పరుచూరి భాస్కరరావు తెలిపారు. అనకాపల్లి టికెట్ను ఇటీవల పార్టీలో చేరిన కొణతాల రామకృష్ణకు కేటాయించడంతోనే పరుచూరి భాస్కరరావు జనసేనకు గుడ్ బై చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆయన త్వరలోనే తన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications