అమరావతికి మరో ప్రతిష్ఠాత్మక సంస్థ..!!
ఏపీ రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక సంస్థలు కొలువు తీరుతున్నాయి. ఇప్పటికే పలు విద్యా సంస్థలు సీఆర్డీఏతో చర్చలు చేసాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు స్థలాల కేటాయింపు పూర్తైంది. వచ్చే నెల నుంచి అమరావతిలో మధ్యలో నిలిచిన నిర్మాణాలు పూర్తి చేసే పనులు ప్రారంభం కానున్నాయి. అదే విధంగా అమరావతిలో భూ కేటాయింపుల పైన నిర్ణయాలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే అమరావతికి ప్రతిష్ఠాత్మక బిట్స్ సంస్థ తమ క్యాంపస్ ఏర్పాటుకు సిద్దమైంది.
అమరావతిలో బిట్స్
అమరావతి లో వేగంగా అడుగులు పడుతున్నాయి. మధ్యలో నిలిచిన పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రపంచ బ్యాంకు నుంచి అమరావతికి రుణం ఈ నెల చివరి వారంలో అధికారికంగా ఆమోదం పొందనుంది. అదే విధంగా ఇప్పటికే కేంద్రం అమరావతి నుంచి కొత్త రైల్వే లైన్ కు ఆమోదం తెలుపుతూ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని ప్రఖ్యాత సంస్థలు అమరావతిలో నెలకొల్పేందుకు ముందుకు వచ్చాయి. తాజాగా అమరావతి రాజధాని ప్రాంతంలో క్యాంపస్ ఏర్పాటుకు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) ఆసక్తి వ్యక్తం చేసింది.

50 ఎకరాల్లో ఏర్పాటు
అమరావతిలో క్యాంపస్ కోసం సీఆర్డీఏ అధికారులతో కలిసి భూములను బిట్స్ ప్రతినిధులు పరిశీలించారు. అమరావతి పరిధిలోని కురగల్లు, వెంకటాయపాలెంలోని స్థలాలను పరిశీలన చేసిన బిట్స్ ప్రతినిధులు సీఆర్డీఏ అధికారులతో చర్చలు చేసారు. రాజస్థాన్లోని పిలానీలో ఉన్న బిట్స్ విద్యాలయానికి ఇప్పటికే గోవా, హైదరాబాద్, దుబాయ్లలో క్యాంపస్లు ఉండగా, తాజాగా ఏపీ రాజధానిలోనూ క్యాంపస్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అమరావతిలో 50 ఎకరాల విస్తీర్ణం లో తమ క్యాంపస్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో బిట్స్ ఉంది.
అధికారిక నిర్ణయం
ప్రస్తుతం ఎస్ఆర్ఎం కొనసాగు తున్న ప్రాంతంలో తమ క్యాంపస్ ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, స్థలం పరిశీలించిన బిట్స్ ప్రతినిధులు సీఆర్డీఏ తో చర్చల సారాంశాన్ని తమ యాజమాన్యంకు వివరిస్తా మని వెల్లడించారు. ఆ తరువాత అమరావతిలో క్యాంపస్ ఏర్పాటు పై బిట్స్ యాజమాన్యం తుది ప్రకటన చేసే అవకాశం ఉంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications