గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో వ్యాపారి హత్య

అతను చిన్నపాటి ప్లాస్టిక్ మౌల్డింగ్ యూనిట్ను నడుపుతున్నాడు. దుండగులు బుధవారం తెల్లవారు జామును ఇంటిలోకి ప్రవేశించి, భారీ వస్తువుతో తలపై మోది అనిల్ కుమార్ను హత్య చేసినట్లు సనత్నగర్ పోలీసు ఇన్స్పెక్టర్ సి. హరిశ్చంద్రా రెడ్డి చెప్పారు.
తలపై తీవ్రమైన గాయం కావడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఉదయంపూట అనిల్ను కలవడానికి పొరుగువారు ఇంటికి వెళ్లడంతో సంఘటన వెలుగు చూసింది. పడకగదిలో రక్తం మడుగులో అనిల్ శవం పడి ఉండడాన్ని వారు చూశారు.
రెండేళ్ల క్రితం భార్య అతన్ని వదిలేసింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనిల్కు ఎవరైనా శత్రువులు ఉన్నారా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్లు, ఇప్పటి వరకు కేసుకు సంబంధించిన వివరాలు ఏమీ తెలియలేదని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications