వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ -జనసేన పొత్తు : ఏపీ బీజేపీకీ హైకమాండ్ కొత్త రోడ్ మ్యాప్..!!

|
Google Oneindia TeluguNews

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ - జనసేన పొత్తు లాంఛనమే. ఇదే సమయంలో బీజేపీ ఏపీలో పరిణామాలపైన ఫోకస్ పెట్టింది. తాజాగా జరిగిన బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశాల్లో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంపై చర్చ జరిగింది. ఏపీలో పరిణామాలపై సోము వీర్రాజు పార్టీ ముఖ్య నేతలకు వివరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి దక్షిణాదిన విస్తరించటం లక్ష్యంగా డిసైడ్ అయ్యారు. ఏపీలో పొత్తుల అంశం పైనా రాష్ట్ర నేతలకు స్పష్టత ఇచ్చారు. కొత్త రోడ్ మ్యాప్ నిర్దేశించారు. ఈ నెల 24న ఏపీ బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో కొత్త కార్యాచరణ ప్రకటించనున్నారు.

టీడీపీ - జనసేన పొత్తు ఎఫెక్ట్ పై ఆరా..

టీడీపీ - జనసేన పొత్తు ఎఫెక్ట్ పై ఆరా..


ఏపీలో రాజకీయాలపై బీజేపీ హైకమాండ్ ఆరా తీసింది. పవన్ కల్యాణ్ తమకు మిత్రపక్షంగా ఉంటూ..టీడీపీతో దగ్గరవుతున్న అంశం పైన ఏపీ నేతలు పార్టీ పెద్దలకు వివరించారు. విశాఖ పర్యటన సమయంలో ప్రధాని ప్రత్యేకంగా పవన్ తో సమావేశమయ్యారు. ఆ తరువాత రెండు పార్టల మధ్య గ్యాప్ తగ్గి..సఖ్యత పెరుగుతుందని భావించారు. కానీ, గతం కంటే జనసేన - బీజేపీ మధ్య దూరం పెరిగింది. ఇదే సమయంలో చంద్రాబు - పవన్ మధ్య దూరం తగ్గింది. ఇప్పుడు పొత్తుగా మారుతోంది. బీజేపీ కూడా తమతో కలిసి రావాలని పవన్ - చంద్రబాబు కోరుకుంటున్నారు. ఇదే అంశం పైన ఢిల్లీ వేదికగా నేతల మధ్య చర్చలు జరిగాయి. దీని పైన బీజేపీ ముఖ్య నేతలు క్లారిటీ ఇచ్చారు. ఏపీలో ఎలా ముందుకు వెళ్లాలనే దాని పైనా స్పష్టత ఇచ్చారు.

పొత్తులపై క్లారిటీ ఇచ్చిన హైకమాండ్..

పొత్తులపై క్లారిటీ ఇచ్చిన హైకమాండ్..

తెలుగు రాష్ట్రాల్లో పొత్తులు ఎవరితో ఉండవని బీజేపీ అధినాయకత్వం తెలుగు రాష్ట్రాల బీజేపీ ముఖ్యులకు తేల్చి చెప్పింది. తెలంగాణలో టీడీపీ తో బీజేపీ పొత్తు ఉంటుందనే అంశం పైన ఆ రాష్ట్ర నేతలు పార్టీ ముఖ్యుల వద్ద ప్రస్తావించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎవరితోనూ పొత్తు ఉండదని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో పవన కల్యాణ్ త‌మ‌ను కాద‌ని టీడీపీతో క‌లిసి జ‌న‌సేన వెళ్లాల‌ని నిర్ణ‌యించుకుంటే, ప‌ట్టించుకోవ‌ద్ద‌ని ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు పార్టీ ముఖ్య నేతలు వెల్లడించారు. ఏపీలో వ్యవహరించాల్సిన తీరు పైన పార్టీ నేతలకు ఈ నెల 24న భీమవరంలో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర ఇంఛార్జ్ అధికారికంగా వెల్లడించనున్నారు.
రెండు పార్టీలకు దూరం.. కొత్త వ్యూహాలు

రెండు పార్టీలకు దూరం.. కొత్త వ్యూహాలు

ఢిల్లీలో పార్టీ నేతలతో సమావేశం తరువాత సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో రెండు కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా పోరాటమే తమ లక్ష్యమని స్పష్టం చేసారు. అదే సమయంలో ఏపీలో తమ వ్యూహాలు కొత్తగా ఉంటాయనే సంకేతాలు ఇచ్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రాజ‌కీయంగా ఎలా ముందుకెళ్లాలో అధిష్టానం దిశానిర్దేశం చేసింద‌ని క్లారిటీ ఇచ్చారు. పొత్తుల కంటే సొంతంగా ఎదగటం పైనే ఫోకస్ చేయాలని కేంద్ర నాయకత్వం బీజేపీ నేతలకు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో తమ పోరాటం పైన సోము వీర్రాజు పార్టీ నేతలకు వివరించారు. వచ్చే నెలలో అమిత్ షా ఏపీ పర్యటనకు రానున్నారని సమాచారం. 2024 ఎన్నికల వ్యూహాల పైన ఆ సమయంలో కీలక నిర్ణయాలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు.

English summary
BJP hi command suggested new strategy for AP leaders amid TDP and Janasena Alliance, party to be announce the route map on 24 th state meeting at Bhimavaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X