కేంద్రమంత్రి సాక్షిగా టీ బీజేపీ నేతల కునుకు! ఏబీఎన్ ప్రసారాలపై రాథోడ్
హైదరాబాద్: కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ప్రెస్ మీట్లో తెలంగాణ బీజేపీ నేతలు కునుకు తీశారు. రాజ్యవర్ధన్ పార్టీ కార్యాలయంలో గురువారం ఉదయం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్ర రావు కునుకు తీస్తూ కనిపించారు.
ఏబీఎన్ ప్రసారాలపై కేంద్రమంత్రి
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాల పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ అన్నారు. ప్రసారాల నిలిపివేత అంశం తమ దృష్టికి వచ్చిందన్నారు. మీడియా స్వేచ్ఛను హరిస్తే తాము ఊరుకోమని చెప్పారు.

మంత్రుల అక్రమాలపై చర్యలు తీసుకోవాలి: కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర సమితి ఇసుక, ల్యాండ్, సారా మాఫియా నేతలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధినేత కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. నల్గొండలో తెరాస నేతలు, పోలీసుల వేధింపులు తాళలేక శంకర్ అనే వ్యక్తి ఆత్మహత్యకు యత్నించారన్నారు.
మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆయన ఆరోపించారు. కాగా, నల్గొండ జిల్లాలో గురువారం నాడు బీజేపీ బంద్ కొనసాగుతోంది. అధికారులు వేధిస్తున్నారని ఓ యువకుడు బుధవారం కిషన్ రెడ్డి ఎదుటే ఆత్మహత్యకు యత్నించాడు. అధికారుల తీరును నిరసిస్తూ నల్గొండ పట్టణ బంద్కు బీజేపీ పిలుపునిచ్చింది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications