ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో వైఎస్ భారతీ రెడ్డికి లింక్ ? జగన్ కేసులతో షాక్..జమ్మలమడుగు ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ రాక్షస పాలన అంతం అయ్యిందని, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీలో కూడా అడుగుపెట్టే పరిస్థితి లేదని, ఓకవేళ అసెంబ్లీలో అడుగుపెడితే జగన్ కు చుక్కలు చూపిస్తామని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో జగన్ భార్య వైఎస్ భారతీ రెడ్డికి సంబంధాలు ఉన్నాయని, త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
జమ్మలమడుగు కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన బీజేపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించిన తరువాత విజయవాడ వెళ్లారు. గురువారం విజయవాడలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతీ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జగన్ భార్య భారతీ రెడ్డి పేరు ఉందని, ఆమె పేరు కూడా త్వరలో బయటకు వస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారయణ రెడ్డి ఆరోపించారు.

మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు కూడా వేగవంతం అవుతుందని, ఇంతకాలం సీఎం పదవిలో ఉంటూ కేసు విచారణ నుంచి తప్పించుకున్న జగన్ కు ఇక ముందు అలాంటి చాన్స్ లేదని ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఇటీవల వైసీపీ పార్టీ నుంచి గెలుపొందిన కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతామని మమ్మల్ని అడుగుతున్నారని, అయితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ఆలోచించి అలాంటి వారి గురించి బీజేపీ హైకమాండ్ ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు.
ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నాయకుల అరాచకాలు తట్టుకున్న ప్రజలు ఇక ఓపికలేక ఆ పార్టీ నాయకులకు సినిమా చూపించారని, కూటమి నాయకులకు పట్టంకట్టారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెప్పారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముద్దాయి అని, అతని మీద చట్టపరంగా అధికారులు చర్యలు తీసుకుంటారని, అతనికి కూడా త్వరలో సినిమా కనపడుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో కంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలం పెరిగిందని, అందుకే 8 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు విజయం సాధించారని ఆదినారాయణ రెడ్డి మీడియాకు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుందని, బీజేపీ, టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు న్యాయం చెయ్యడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారని, అందులో ఎలాంటి అనుమానం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయ రెడ్డి అన్నారు. ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రజలను టార్చర్ పెట్టి వారిని హింసించిన వైసీపీ నాయకులకు త్వరలో ప్రజలే తగినబుద్ది చెబుతారని, ఆ రోజులు దగ్గర్లోనే ఉన్నాయని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
సపోటా పండులో విషం పెట్టి రెండేళ్ళ కూతుర్ని చంపేసిన తండ్రి.. ఆపై -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications