అన్నం తినే వైసీపీకి ఓట్లు వేసారా..!!
బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అనుచిత వ్యాఖ్యలు చేసారు. అసెంబ్లీలో వైసీపీకి ఓటు వేసిన వారి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాదస్పదమయ్యాయి. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం పై చర్చలో భాగంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పైన ప్రశంసలు గుప్పిస్తూ...జగన్ పాలన పైన విమర్శలు కొనసాగించారు. ఆ సమయంలోనే విష్ణుకుమార్ రాజు వైసీపీకి ఓటు వేసిన వారి పైన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
వైసీపీకి ఎన్నికల్లో 40 శాతం ఓట్లు పోలైన అంశాన్ని విష్ణు కుమార్ రాజు చెప్పుకొచ్చారు. వైసీపీకి ఓట్లు వేశారంటే వాళ్లు అన్నం తినే వేసారా..మనసుతో ఆలోచించి ఓట్లు వేశారా..ఏ విధంగా ఓట్లు వేశారో అర్దం కావటం లేదంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ అయిదేళ్ల పాలన చూసిన తరువాత కూడా ఈ విధంగా ఓట్లు వేయటం పై ఆలోచించాలని అని అన్నారు. విష్ణుకుమార్ రాజు అసెంబ్లీ వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వివేకా హత్య అంశం పైన విష్ణుకుమార్ రాజు స్పందించారు. ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించాలి..శాస్త్రీయ పద్దతిలో విచారించాలన్నారు. పక్కన ఉన్న సభ్యులు ఇప్పటికే సీబీఐ విచారణ జరుగుతోందని చెప్పగా..విచారణను వేగవంతం చేయాలని కప్పి పుచ్చకొనే ప్రయత్నం చేసారు. దీని పైన స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు దీని పై సీబీఐ దర్యాప్తు చేసిందని..త్వరలో తీరపు వచ్చేలా చేసి అసలైన హంతకులను శిక్షిస్తామన్నారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications