ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుమార్పులు తథ్యం...సిద్దం కండి:జీవీఎల్ మరోసారి సంచలనం
బిజెపి రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎపి రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోబోతున్నాయని పునరుద్ఘాటించారు.
గురువారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే మూడు నుంచి ఆరు నెలల్లోగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. రానున్న మార్పులకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపు నిచ్చారు.

కర్ణాటక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతలు బిజెపిపై విష ప్రచారం చేశారని జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో నిధుల దుర్వినియోగం జరిగిందని కాగ్ నిర్ధారించిందని, అయితే కాగ్కు కేంద్రంతో గానీ, ఏ రాజకీయ పార్టీతో గానీ సంబంధం ఉండదనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అక్రమాలకు పాల్పడినందుకు చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలే శిక్షిస్తారని జివిఎల్ చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీని టీడీపీ ప్రచార వేదికగా మార్చారని ఆయన ఆరోపించారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications