సర్వే లెక్కలు: 'పొత్తు'పైనే ఆ ఇద్దరు ఎమ్మెల్యేల భవితవ్యం..
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ టీమ్ చేపట్టిన సర్వేలో పలు రాజకీయ సమీకరణాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సర్వేలో వెల్లడించిన విషయాలను పరిశీలిస్తే..
విశాఖపట్నం: ఆంధ్రజ్యోతి ఫ్లాష్ టీమ్ చేపట్టిన సర్వేలో పలు రాజకీయ సమీకరణాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సర్వేలో వెల్లడించిన విషయాలను పరిశీలిస్తే.. ముఖ్యంగా పాయకరావు పేట టీడీపీ ఎమ్మెల్యే అనిత పరిస్థితి కాస్తంత విచిత్రంగానే ఉందనే చెప్పుకోవాలి. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ ఉమ్మడి పొత్తుతో గనుక పోటీ చేస్తే.. ఆ ఎఫెక్ట్ అనిత గెలుపుపై ప్రభావం చూపిస్తుందని సర్వేలో వెల్లడైంది.
పొత్తు పెట్టుకుంటే అనితకు పరాభవమే!:

బీజేపీ-టీడీపీ గనుక ఉమ్మడి పోరుకు దిగితే.. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన పాయకరావుపేటలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే అనిత ఓటమిపాలవడం ఖాయమని సర్వే తేల్చింది. ఉమ్మడి పోరుతో టీడీపీ-బీజేపీ కూటమికి 42.56శాతం ఓట్లు మాత్రమే అక్కడ పోల్ అయ్యే అవకాశం ఉందని, వైసీపీకి స్వల్ప ఆధిక్యంతో 42.79శాతం మంది మద్దతు పలికే అవకాశముందని సర్వే పేర్కొంది.
పొత్తు లేకపోతేనే అనితకు మేలు:

పొత్తు లేకుండా గనుక వచ్చే ఎన్నికల బరిలో దిగితే మాత్రం టీడీపీకి 48.25శాతం మంది మద్దతు పలుకుతారని, అప్పుడు వైసీపీ మద్దతుదారుల సంఖ్య 41.13కి పడిపోతుందని సర్వే ద్వారా వెల్లడైంది. బీజేపీకి కేవలం 6.5శాతం మంది మద్దతు మాత్రమే లభిస్తుందని తేలింది. అంటే, పొత్తు లేకుండా పోటీ చేస్తేనే టీడీపీ ఎమ్మెల్యే అనిత మరోసారి అసెంబ్లీలో అడుగుపెడుతారని సర్వే చెబుతోంది.
పొత్తుపైనే రాజు గారి భవితవ్యం :

ఇక విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పరిస్థితి కూడా కాస్త విచిత్రంగానే ఉంది. ఉమ్మడి పోరుతో బరిలోకి దిగితేనే ఆయన గెలుస్తారని, లేనిపక్షంలో ఓటమి తప్పదని సర్వే చెబుతోంది. బీజేపీ ఒంటరి పోరు చేయాల్సి వస్తే.. వైసీపీకి పోల్ అయ్యే ఓట్లలో సగం ఓట్లు కూడా బీజేపీకి దక్కవని సర్వే పేర్కొంది. కాబట్టి.. వచ్చే ఎన్నికల్లో పొత్తు పైనే ఆయన విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయని సర్వే వెల్లడిస్తుంది.
పొత్తు కొనసాగుతుందా?

మొత్తానికి సర్వే ద్వారా భిన్నమైన సమీకరణాలు వ్యక్తమవుతుండడంతో.. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ-టీడీపీ సయోధ్య ఇలాగే కొనసాగుతుందా? లేక ఈ బంధానికి తెరపడుతుందా? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీతో కలిసి నడవడం ద్వారా టీడీపీకి ఒరిగేదేమి ఉండదని సర్వే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో.. భవిష్యత్తులో ఈ రెండు పార్టీల పయనం ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.
-
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ..












Click it and Unblock the Notifications