బాణాసంచా కేంద్రంలో పేలుడు: నలుగురి మృతి, పలువురికి గాయాలు
తూర్పుగోదావరి: జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. కొత్తపేట మండలం పలివెలలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి.
క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. కాగా, గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. దీపావళి పండుగ కోసం అనధికారికంగా పెద్ద ఎత్తున బాణాసంచా తయారు చేస్తున్నట్లు సమాచారం.
2014లో తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగి పది మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

విషం తాగి ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యాయత్నం
పశ్చిమగోదావరిలో జిల్లాల విషం తాగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం చేశారు. నలుగురిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది.
కానిస్టేబుల్ చేతిలో ప్రమాదవశాత్తూ పేలిన తుపాకీ
కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రమాదవశాత్తూ తుపాకీ పేలింది. కానిస్టేబుల్ చేతిలో ఉన్న ప్రమాదవశాత్తూ తుపాకీ పేలిందని, ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications