ఏపీ సచివాలయంలో అన్ని బ్లాకులకు వాస్తు దోషం: ఇక రాక పోకలు అన్నీ బ్లాకుల ప్రధాన ద్వారాల నుండే
సచివాలయంలో రోజుకొక నిర్ణయంతో సంచలనాలు సృష్టిస్తున్నారు.ఇప్పటికే వాస్తు పేరిట కొత్త ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేస్తుంటే.. కొన్ని ద్వారాలు మూసివేస్తున్నారు పోలీసులు.సచివాలయంలో ని ప్రతి బ్లాక్ లో నుంచి
అమరావతి: సచివాలయంలో రోజుకొక నిర్ణయంతో సంచలనాలు సృష్టిస్తున్నారు. ఇప్పటికే వాస్తు పేరిట కొత్త ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేస్తుంటే.. కొన్ని ద్వారాలు మూసివేస్తున్నారు పోలీసులు.
సచివాలయంలో ని ప్రతి బ్లాక్ లో నుంచి మరో బ్లాక్ లోకి వెళ్లేందుకు అధికశాతం అత్యవసర మార్గం వద్ద ఉన్న ద్వారాలు వినియోగిస్తుంటారు. బ్లాక్ లో నుంచి వెలుపలికి వచ్చి మరల మరో బ్లాక్ లోకి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి రావాలి. అయితే ప్రస్తుతం అత్యవసర ద్వారాలు అటు ఉద్యోగులకు, సందర్శకులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి.
కాగా భద్రత కారణాల పేరుతో సచివాలయ ఎస్పీఎఫ్ అధికారులు ఈ అత్యవసర ద్వారాలు మూసివేశారు. ఉనతాధికార్ల ఆదేశానుసారం ఈ ద్వారాల్ని శాశ్వతంగా మూసివేస్తున్నట్లు వారు చెప్పారు.
భద్రత చర్యల్లో భాగంగా ద్వారాలు మూసివేయడం జరిగిందన్నారు. ఏప్పుడో మూసివేయాల్సిన ద్వారాలు సచివాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల రీత్యా అలానే ఉంచామన్నారు. అత్యాసర ప్రవేశమార్గం కాబట్టి మూసివేయక తప్పదన్నారు. రాక పోకలన్నీ బ్లాక్ లోని ప్రధాన మార్గం గుండానే సాగాలని స్పష్టం చేశారు.