హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తలసాని షాక్: అప్రమత్తమైన బాబు, ఇంకా ఎవరు..?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణా రెడ్డి తదితర నేతలు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సంక్షోభం నేపథ్యంలో టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. చంద్రబాబు గురువారం అందుబాటులో ఉన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో భేటీ అయ్యారు.

ఈ భేటీలో తెలంగాణ టీడీపీ కమిటీ చైర్మన్ ఎల్ రమణ, ఎమ్మెల్యేలు మాగంటి బాబు, రేవంత్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, అరికపూడి గాంధీ తదితరులు కలవనున్నారు. తాజా పరిణామాల పైన చంద్రబాబు వారితో చర్చించారు. సాయంత్రం మరోసారి తెలంగాణ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు.

తెలంగాణలో పలువురు ముఖ్యనేతలు తెరాసలోకి వెళ్తున్నందున.. ఇంకా ఎవరైనా పార్టీని వీడుతారా అని చంద్రబాబు వారి నుండి ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. తలసాని, తీగల వంటి నేతలు పార్టీ వీడటం వరకు అభ్యంతరం లేదని, విద్యుత్ విషయంలో తనను తప్పుపట్టడాన్ని చంద్రబాబు తీవ్రంగా పరిగణనిస్తున్ారని తెలుస్తోంది.

కాగా, తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణా రెడ్డి సహా నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్న విషయం తెలిసిందే. తలసాని తాము తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. శుక్రవారం తెలంగాణ టీడీపీ బస్సుయాత్ర ప్రారంభం కానుంది. బస్సుయాత్రకు ముందే పార్టీలో సంక్షోభం ఏర్పడటం గమనార్హం.

English summary
In a major setback to the Telugu Desam Party in Telangana, four of its MLAs and an MLC have decided to cross over to the Telangana Rashtra Samiti on 
 Thursday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X