అన్నదమ్ముల్లా ఉండాలి: బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బోనాలు(పిక్చర్స్)
కృష్ణా: బెజవాడ కనక దుర్గమ్మకు ఆదివారం తెలంగాణ నుంచి వచ్చిన భక్తులు ఘనంగా బోనాలు సమర్పించారు. హైదరాబాద్ పాతబస్తీ ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వేడుకగా జరిగింది.
అందంగా అలంకరించిన బోనాలు ఉంచిన మట్టిపాత్రలను నెత్తిమీద పెట్టుకుని మహిళలు భక్తి ప్రపత్తులతో ఘాట్రోడ్డుమీదుగా కాలినడకన అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. బోనాలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టారు. రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు సుఖ శాంతులతో ఉండాలంటూ అమ్మవారిని వేడుకున్నారు.
మాతంగిగా వచ్చిన స్వీటీ మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు అందరు అన్నదమ్ముల్లా ఉండాలని అమ్మవారికి బోనాలు ఇచ్చినట్లు తెలిపారు. జులై 29, 30, 31 తేదీల్లో కనకదుర్గమ్మవారి శాకంబరీ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో నర్సింగరావు ఆదివారం చెప్పారు.
బోనాలు
బెజవాడ కనక దుర్గమ్మకు ఆదివారం తెలంగాణ నుంచి వచ్చిన భక్తులు ఘనంగా బోనాలు సమర్పించారు.
బోనాలు
హైదరాబాద్ పాతబస్తీ ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వేడుకగా జరిగింది.
బోనాలు
అందంగా అలంకరించిన బోనాలు ఉంచిన మట్టిపాత్రలను నెత్తిమీద పెట్టుకుని మహిళలు భక్తి ప్రపత్తులతో ఘాట్రోడ్డుమీదుగా కాలినడకన అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు.
బోనాలు
బోనాలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టారు. రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు సుఖ శాంతులతో ఉండాలంటూ అమ్మవారిని వేడుకున్నారు.
బోనాలు
మాతంగిగా వచ్చిన స్వీటీ మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు అందరు అన్నదమ్ముల్లా ఉండాలని అమ్మవారికి బోనాలు ఇచ్చినట్లు తెలిపారు.
బోనాలు
జులై 29, 30, 31 తేదీల్లో కనకదుర్గమ్మవారి శాకంబరీ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో నర్సింగరావు ఆదివారం చెప్పారు.
బోనాలు
హైదరాబాద్ పాతబస్తీ ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వేడుకగా జరిగింది.