కేసులుండటం సహజం, ఇప్పుడే కనిపించాయా?: పవన్కు బోండా కౌంటర్
విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవర్ కళ్యాణ్పై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రౌడీ ఎమ్మెల్యేలను టీడీపీ ప్రోత్సహిస్తోందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.
Recommended Video

గురువారం బోండా ఉమ మాట్లాడుతూ.. దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్పై ఆయన చేసిన ఆరోపణలు సరికావని అన్నారు. ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను బేరీజు వేసుకుని మాట్లాడాలని సూచించారు.

ప్రతిపక్షంలో ఉండగా చేసిన రాజకీయ పోరాటాలపై పెట్టిన కేసులనే పవన్ ఎత్తి చూపిస్తున్నారని, ఏ రాజకీయ పార్టీ నాయకుడిపైనైనా అలాంటి కేసులు ఉండటం సహజమని ఉమ అన్నారు.
మూడేళ్లపాటు టీడీపీతో కలిసి పనిచేసిన పవన్కు ఇప్పుడే కేసులు కనిపించాయా? అని బోండా ప్రశ్నించారు. అంతేగాక, మహిళా అధికారిపై దాడులు చేశారంటూ వ్యాఖ్యానించిన పవన్.. అందులో వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. కాగా, బుధవారం దెందులూరు సభలో రౌడీ అంటూ ఎమ్మెల్యే చింతమనేనిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications