డిసెంబర్ దాకా ఆపగల్గితే: టిపై బొత్స, పాట్నాకు స్పీకర్

సమైక్యాంధ్ర కోసం అధిష్టానం నుండి ఎంతకు సానుకూల ప్రకటన రాకపోవడంతో పలువురు ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. వారిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బొత్సలు బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా తనతో సమావేశమైన ఎంపీలతో బొత్స మాట్లాడుతూ.. తొందర పడవద్దని, అవసరమైతే అందరం కలిసి రాజీనామా చేద్దామని చెప్పారట.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అదే అభిప్రాయాన్ని వారి ముందు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. రాజీనామా చేయవద్దని, సభలలో తెలంగాణ బిల్లు అడ్డుకోవాలంటే పదవులలో ఉండాలని, అవసరమైతే అందరం కలిసి నిర్ణయానికి వద్దామని చెప్పారట.
పాట్నాకు స్పీకర్.. ఎంపీల అపాయింటుమెంట్ వాయిదా
మరోవైపు స్పీకర్ మీరా కుమార్ పాట్నా పర్యటనకు వెళ్లారు. దీంతో ఎంపీల అపాయింటుమెంట్ ఈ నెల 30వ తేదికి వాయిదా పడింది. స్పీకర్ను కలిసేందుకు ఎంపీలు కార్యాలయానికి వెళ్లారు. ఆమె అందుబాటులో లేరు. దీంతో కార్యాలయ వర్గాలు 30న కలవాలని సూచించారు.
తాము స్పీకర్ను కలిసే ప్రయత్నాలు చేశామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి అందజేశానన్నారు. ఆమె అపాయింటుమెంట్ కోరినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications