రద్దీ మార్గంలో విరిగిన పట్టా: అదే రూట్లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్: క్షణాల్లో.. !
కడప: మన రాష్ట్రం మీదుగా చెన్నై-ముంబై మధ్య రాకపోకలు సాగించడానికి అందుబాటులో ఉన్న ఏకైక రైలు మార్గం అది. రోజూ పదుల సంఖ్యలో ఎక్స్ప్రెస్, ప్యాసింజర్స్, గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. కడప మీదుగా తిరుపతికి వెళ్లడానికి ఉన్న మార్గం కూడా అదొక్కటే. అలాంటి మార్గంలో రైలు పట్టా విరిగిన ఘటన కలకలం రేపింది. రైల్వే స్టేషన్లో పనిచేసే ట్రాక్మెన్లు సకాలంలో గుర్తించడంతో వెంకటాద్రి ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది.

కడప జిల్లాలోని ఓబులవారి పల్లె రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుపతి, రేణిగుంట మీదుగా చిత్తూరు నుంచి కాచిగూడ వెళ్తున్న వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రావడానికి సుమారు 20 నిమిషాల ముందు ఈ విషయాన్ని గుర్తించారు ట్రాక్మెన్లు. దీనితో రైలును ఓబులవారి పల్లెలో నిలిపివేశారు. రైలు ఓబులవారిపల్లె వద్దకు రాగానే పట్టా విరిగినట్టు గుర్తించారు. స్టేషన్ మాస్టర్కు సమాచారం ఇచ్చారు.

వెంటనే ఆయన ఈ విషయాన్ని రేణిగుంట జంక్షన్ అధికారులకు తెలియజేశారు. రేణిగుంట నుంచి ట్రాక్ ఇంజినీరింగ్ సిబ్బంది వచ్చి మరమ్మతులు చేపట్టారు. మరమ్మతుల కారణంగా రైలు దాదాపు గంటపాటు నిలిచిపోయింది. అదే మార్గంలో రాకపోకలు సాగించాల్సిన కొన్ని గూడ్స్ రైళ్లను కూడా ఓబులవారి పల్లెలోనే నిలిపివేశారు. విరిగిన పట్టాను సకాలంలో గుర్తించకపోయి ఉంటే పెను ప్రమాదానికి కారణమై ఉండొచ్చనే భయాందోళనలు స్థానికుల్లో వ్యక్తం అయ్యాయి.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications