BUDGET 2024: కేంద్ర బడ్జెట్ పై ఏపీ గంపెడాశలు; ఈసారైనా కేంద్రం కరుణిస్తుందా?
కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్ నేడు పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న ఈ మధ్యంతర బడ్జెట్ పై దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వారి భారీ అంచనాలు ఉన్నాయి. పేదల ఆశలు, మధ్యతరగతి ఆకాంక్షలు, వ్యాపార వర్గాల భారీ అంచనాల నడుమ మధ్యంతర బడ్జెట్ నేడు దేశ ప్రజల ముందుకు రాబోతోంది . బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనుండటం ఇది వరుసగా ఆరోసారి.
ఈ బడ్జెట్ ద్వారా భారతదేశాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు అనేది ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వివరించే అవకాశాలు ఉన్నాయి. మోదీ సర్కారు తాత్కాలిక పద్దులోనూ తాయిలాల వర్షం కురిపించే అవకాశాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే నిర్మల సీతారామన్ ప్రవేశపెడుతున్న ఓపెన్ అకౌంట్ బడ్జెట్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకోవడానికి రాష్ట్రాల వారిగా కేటాయింపులు బాగానే ఉండొచ్చంటున్నారు.

ఇక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని కేటాయింపులు ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు. వాటి వివరాల్లోకి వెళితే ఏపీ ప్రత్యేకహోదాతోపాటు, పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన నిధులు కేటాయించాలి. ఉక్కు కర్మాగారానికి 683 కోట్లు కేటాయించాలి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయడం లేదని, ప్రకటన చేయడంతో పాటు విశాఖ ఉక్కు కర్మాగారం అభివృద్ధికి నిధులను కేటాయించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధిలో కేంద్రం వాటా పెరగాలి .
ఓడరేవుల అభివృద్ధి వేగవంతంగా జరగాలి. పోలవరం ప్రాజెక్ట్ పై బడ్జెట్లో కేటాయింపులు చేయాలి. ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ యూనివర్సిటీ, పెట్రోలియం యూనివర్సిటీలకు నిధుల కేటాయింపులు చేయాలి. హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ తరహాలో ఏపీ లోను వ్యవసాయ పరిశోధన సంస్థ ఏర్పాటు కావాలి. ఏపీలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు జరగాలి. మంగళగిరిలోని ఎయిమ్స్ ఆస్పత్రికి నిధులను కేటాయించాలి.
కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి లభిస్తున్న వాటా పెరగాలి. పెట్రోల్, డీజిల్ ధరలపై సుంకాలు తగ్గించాలి. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలలో పట్టణ మౌలిక అభివృద్ధి నిధులు ఈ బడ్జెట్లో పెంచి కేటాయించాలి. భోగాపురం విమానాశ్రయం నిర్మాణం బడ్జెట్ కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాలి. పీఎం ఆవాస్ యోజన కేటాయింపులు ఏపీకి పెరగాలి.
ఏపీలోని స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఉద్యోగులకు పన్ను రాయితీలు, ఏపీలో రోడ్ల కోసం నిధులు కేటాయించాలి. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ బడ్జెట్ పై అనేక అంచనాలు ఉన్నాయి. మరి ఈ ఆశలలో కొన్ని అయినా కేంద్రం నెరవేరుస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications