కనకదుర్గమ్మ భక్తులకు బంపరాఫర్.. ఫ్రీ వరలక్ష్మి వత్రానికి దరఖాస్తులు..
బెజవాడ ఇంద్రకీలాద్రీపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లే భక్తులకు బంపరాఫర్. ఆగస్టు 16వ తేదిన వరలక్ష్మి వత్రం సందర్భంగా అమ్మవారు వరలక్ష్మీ దేవిగా అవతరించున్నారు. ఇందులో భాగంగా భక్తులకు ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం భక్తుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. రెండో శుక్రవారం కావడంతో కనకదుర్గమ్మ అమ్మవారిని వరలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. వీటితో పాటు ఈ నెల 17వ తేది నుంచి 20వ తేది వరకు పవిత్రోత్సవాలు కూడా నిర్వహించనున్నారు. ఆగస్టు 23 వ తేదిన సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించాలని ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇక, ఫ్రీ వరలక్ష్మి వ్రతం కోసం భక్తులు దరఖాస్తు చేసుకోవాలని ఆలయ అధికారులు కోరారు.
ఈ నెల 23వ తేదిన సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించనున్నారు. ఇక, ఆ రోజు ఉదయం ఏడుగంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఆర్జిత సేవ టికెట్ రూ.1500తో కొన్న వారికి వ్రతం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం పదిగంటల నుంచి 11.30 వరకు తెల్ల రేషను కార్డు కలిగి ముందుగా ఫ్రీ వరలక్ష్మి వ్రతానికి అప్లయ్ చేసుకున్న వారికి మాత్రమే వరలక్ష్మీ వ్రతాన్నినిర్వహిస్తారు. కనకదుర్గమ్మ ఆలయంలో నిర్వహించే ఈ సామూహిక వరలక్ష్మి వ్రతానికి బ్యాచ్కు 500 మందికి మాత్రమే అనుమతి ఉంటుదని ఆలయ అధికారులు పేర్కొన్నారు.

పవిత్రోత్సవాలు..
ఆగస్టు 17వ తేది నుంచి 21 వరకు ఫ్రీ వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనే భక్తులకోసం దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులు పేర్కొన్నారు. వరలక్ష్మీ వ్రతం పూర్తయ్యాక ఆ మహిళలకు రూ.300 దర్శనం క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా వచ్చే భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితోపాటు దుర్గమ్మ కొండపై ఆగస్టు17 నుంచి 20 వరకు పవిత్రోత్సవాలు కూడా జరగనున్నాయి.
ఇందులో భాగంగా అమ్మవారికి ఈ నెల 17న సాయంత్రం నాలుగు గంటలకు ఉదక శాంతి, 18వ తేదిన ఉదయం మూడు గంటలకు సుప్రభాత సేవ, స్నపనాభిషేకం వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వీటితోపాటు ఉదయం తొమ్మిది గంటలకు భక్తులను సర్వ దర్శనానికి అనుమతించనున్నారు. ఆగస్టు 19వ తేదిన మండపారాధన, మూలమంత్ర హవనాలు, వేదపారాయణలు, హారతి, మంత్రపుష్పం వంటి కార్యక్రమాలు ఉంటాయి. అలాగే ఈ నెల 20వ తేదిన ఉదయం 10.30 గంటలకు పూర్ణాహుతి, కలశోద్వాసనతో పవిత్రోత్సవాలు ముగించనున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications