అమరావతి శంకుస్థాపనకు డుమ్మా కొట్టిన పవన్ కళ్యాణ్: షూటింగ్లో బిజీ బిజీ
అమరావతి: జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్యయంగా ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్లు సర్ధార్ గబ్బర్ సింగ్ షూటింగ్ స్పాట్ కు వచ్చి మరీ ఆహ్వానించారు. ఆహ్వాన పత్రిక అందుకున్న వెంటనే మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను శంకుస్థాపనకు వస్తానో? లేదో అనే అనుమాంగానే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
అయితే కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని మంత్రులు ఆయనను కోరారు. శంకుస్థాపనకు రావాలని తనకూ ఉందని, అయితే షూటింగ్ షెడ్యూల్ అందుకు అనుమతించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరుపై అయోమయం నెలకొంది.

అయితే అందరూ అనుమానించినట్లే ఈరోజు జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టారు. ప్రస్తుతం గుజరాత్లో జరుగుతున్న తన తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ లో ఆయన బిజీగా ఉన్నారు. మరోవైపు రాజధాని అమరావతి శంకుస్థాపనకు సర్వం సిద్ధమైంది.
చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అమరావతి నిర్మాణానికి నిర్వహిస్తున్న శంకుస్థాపన కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది ప్రజలు అమరావతికి తరలివస్తున్నారు. తెల్లవారుజామున 2 గంటల నుంచే ప్రజలు బస్సుల్లో శంకుస్థాపన ప్రాంతానికి చేరుకుంటున్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
-
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
ఏపీలో మహిళలకు దక్కే నియోజకవర్గాలు లిస్టు ఇదే, కీలక మంత్రుల స్థానాలు సైతం..!! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications