మోడీతో ప్రారంభం, 2030 నాటికి ప్రపంచమంతా హిందూరాజ్యం: సింఘాల్
న్యూఢిల్లీ/ఏలూరు: 15 ఏళ్లలో ప్రపంచమంతా హిందూ రాజ్యంగా మారుతుందని విశ్వహిందూ పరిషత్ అగ్ర నాయకులు అశోక్ సింఘాల్ శనివారం నాడు అన్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో 2014 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించిందన్నారు.
ఇది సామాన్యమైనది కాదన్నారు. 800 సంవత్సరాల బానిసత్వానికి ఇది ముగింపు అన్నారు. దేశంలో జరగబోయే మార్పులకు ఈ విజయం నాంది అన్నారు. 2020 నాటికి భారత దేశం హిందూ రాజ్యంగా అవతరిస్తుందని జోస్యం చెప్పారు.
2030 నాటికి యావత్ ప్రపంచం కూడా హిందూ సమ్రాజ్యంగా మారుతుందని సత్య సాయిబాబా గతంలోనే తనకు చెప్పారన్నారు. అది నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయన్నారు.

ఆ విప్లవం ఇప్పుడే ప్రారంభమయిందన్నారు. తొగాడియా.. ఆరెస్సెస్ మాజీ సర్ సంఘచాలక్ కెఎస్ సుదర్శన్ జీవిత విశేషాలతో కూడిన పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనేది హిందూ సమాజ కల అని, అది త్వరలో నెరవేరుతుందని అంతర్జాతీయ కార్యాధ్యక్షులు ప్రవీణ్ భాయ్ తొగాడియా ఏపీలో అన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా వచ్చిన తొగాడియా .. నరసాపురంలో శనివారం నిర్వహించిన హిందూ సమ్మేళన సభలో పాల్గొన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications