టీ ఉద్యమం కూడా ఇలాగే: కర్నూలుపై సీఆర్ హెచ్చరిక
అలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో రాకుండా చూడాలన్నారు. కర్నూలు రాజధాని కోసం ప్రజలు తమ పైన ఒత్తిడి తెస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన విమానాశ్రయాలు, సీ పోర్టులు జరిగే పని కాదన్నారు.
రఘువీరా రెడ్డిపై మండిపడ్డ జేసీ ప్రభాకర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పైన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. మంత్రిగా ఉన్నప్పుడు ఏనాడూ సమైక్య రాష్ట్రం గురించి మాట్లాడని రఘువీరా ఇప్పుడు మాత్రం రాజధాని ఎక్కడ పెట్టాలనే దానిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అడుగుతున్నారని, అలా అడిగే హక్కు ఆయనకు లేదన్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఇన్నేళ్లయినా అనంతపురం జిల్లాకు రఘువీరా చేసిందేమీ లేదన్నారు. మైకుల ముందు అవాకులు చెవాకులు పేలడం మానుకోవాలన్నారు.
మంత్రుల ఇంటి అద్దె భత్యాలు పెంచిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రులకు ఇంటి అద్దె భత్యాలను పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక సాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మంత్రుల ఇంటి అద్దె భత్యాల పెంపుదలపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టగా, సభ ఆమోదించింది.