కాల్ మనీ ఎఫెక్ట్: స్నేహం విషయంలో బాబు జాగ్రత్తలు, జగన్పై తీవ్రంగా (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు టిడిఎల్పీలో మంత్రులకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఎమ్మెల్యేలతో కలిసి పని చేయాలని, ఒకరిద్దరి తప్పులతో పార్టీకి చెడ్డపేరు తెస్తే సహించేది లేదన్నారు. ప్రతి సోమవారం విజయవాడలో అందరికీ అందుబాటులో ఉండాలని సూచించారు.
కాల్ మనీ ఘటన నేపథ్యంలో స్నేహాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు మంత్రులకు, ఎమ్మెల్యేలకు సూచించారు. ఇటీవల కాల్ మనీ వ్యవహారంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్నేహం కారణంగా కొందరితో కలిసి విదేశాలకు వెళ్లాడు.
అందులో కాల్ మనీ నిందితుడు ఉన్నారు. దీంతో బోడె ప్రసాద్ను కూడా విపక్షం కాల్ మనీ నిందితుడంటూ ఆరోపిస్తోంది. అదే సమయంలో, వైసిపి అధినేత జగన్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకే శాసన సభను వదిలేసి వెళ్లిపోయారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
చంద్రబాబు
టిడిఎల్పీ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మంత్రులు, ఎమ్మెల్యేలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
చంద్రబాబు
టిడిఎల్పీ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సమావేశంలో పాల్గొన్న మంత్రులు, పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు.
చంద్రబాబు
టిడిఎల్పీ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సమావేశంలో పాల్గొన్న మంత్రులు, పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు.
మెట్లకు చంద్రబాబు పరామర్శ
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణను పరామర్శించారు.
మెట్లకు చంద్రబాబు పరామర్శ
మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ చంద్రబాబు కేబినెట్లో 1996-99 వరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. అమలాపురం నుంచి మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
మెట్లకు చంద్రబాబు పరామర్శ
ఆసుపత్రిలో మెట్ల సత్యనారాయణను పరామర్శించిన అనంతరం కుటుంబ సభ్యులు, పార్టీ వారితో మాట్లాడుతున్న చంద్రబాబు.
కొరియా ప్రతినిధులతో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సోమవారం నాడు ఏపీ అసెంబ్లీలో కొరియా ప్రతినిధులు కలిశారు.
కొరియా ప్రతినిధులతో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సోమవారం నాడు ఏపీ అసెంబ్లీలో కొరియా ప్రతినిధులు కలిశారు.