కాల్ మనీ: జగన్ పార్టీ రాష్ట్ర మహిళా నేత భర్త అరెస్టు
ఏలూరు: కాల్మనీకేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి భర్త ఈడ్పుగంటి నవరాజును పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కాల్ మనీ వ్యవహారంలో అన్ని పార్టీల నాయకులకు ప్రమేయం ఉందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ అరెస్టు జరిగింది.

శ్రీలక్ష్మి భర్త నవరాజు, మరికొందరి వద్ద పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తూర్పువీధికి చెందిన కలగర శివరామకృష్ణ ప్రసాద్, అతనిభార్య మృణాళిని కొంత సొమ్ము అప్పుగా తీసుకున్నారు. ఆ రుణానికి కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను రిజిస్ర్టేషన్ చేయించుకున్నారని, మరికొన్ని ఆస్తులను కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని గత నెల 17న ఏలూరు పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.
బాధితుల ఫిర్యాదు ఫిర్యాదు మేరకు శ్రీలక్ష్మి, నవరాజు, హరి భగవాన్ తదితరులపై కేసు నమోదు చేశారు. కాల్ మనీ కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications