వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీటి యుద్దాల వ్యాఖ్య: జగన్‌పై పోలీసులకు ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే నీటి పంపకాలపై తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య యుద్ధాలు జరిగే అవకాశాలున్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వ్యాఖ్యానించడంపై హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు అందింది.

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన జగన్‌పై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ న్యాయవాదుల జెఎసి ప్రతినిధులు కె.మల్లేశ్, శ్రీనివాస్ అనిల్, కె.గోవర్ధన్ రెడ్డి, యాదగిరి, శ్రీనివాసులు, ఇంద్రసేనారెడ్డి, యాకుబ్ ఫిర్యాదులో అన్నారు.

 Campaint against YS Jagan in PS

అశోక్‌బాబు, వంగపండులపై కోర్టులో ఫిర్యాదు

కర్నూలులో జరిగిన సేవ్ఆంధ్రప్రదేశ్ సభలో తెలంగాణ ప్రజలపై అనుచిత, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఏపీఎన్జీవోల నేత అశోక్‌బాబు, కళాకారుడు వంగపండులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎంపీ భార్గవ్ రంగారెడ్డి జిల్లా 11వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లయింట్ దాఖలు చేశారు.

మెజిస్ట్రేట్ కిరణ్ కేసు పరిశీలించి, వీరిపై కేసు నమోదు చేసి, అక్టోబర్ 30వ తేదీలోపు నివేదిక సమర్పించాలని చేయాలని హైదరాబాదులోని సరూర్‌నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

English summary
Complaint was made against YSR Congress party president YS Jagan in Saifabad police station for making comments against Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X