పురందేశ్వరి వల్ల కానిది మాధవ్ సాధిస్తారా ? బీజేపీ నేతల లెక్కలేంటి ?
ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికలకు ముందు కూటమిగా కలిసి పోటీ చేసిన టీడీపీ, జనసేన, బీజేపీలు భారీ మెజార్టీతో విజయం సాధించాయి. రాష్ట్రంలో పార్టీల బలాబలాల్ని దృష్టిలో ఉంచుకుని పొత్తులో భాగంగా అత్యధిక సీట్లు తీసుకున్న టీడీపీ 90 శాతం పైగా విజయాల్ని నమోదు చేసుకుంది. అలాగే జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన 21 సీట్లూ గెల్చుకుంది. ఇక బీజేపీ మాత్రం 8 సీట్లలో విజయం సాధించింది. తాజాగా కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకుంది.
అయితే కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న బీజేపీకి పదవుల విషయంలో మాత్రం మొండిచేయే ఎదురవుతోంది. కూటమిలో అన్ని పార్టీలు సమానమే అని చెప్తున్నా చంద్రబాబు మాత్రం ఎమ్మెల్యేల ప్రాతినిధ్యాన్ని సాకుగా చూపుతూ బీజేపీకి 5 శాతం పదవులతో సరిపెట్టేస్తున్నారనే అసంతృప్తి ఆ పార్టీ నేతల్లో నెలకొంది. ఇదే విషయాన్ని తాజాగా రాష్ట్రంలో కొత్త బీజేపీ ఛీఫ్ గా పీవీఎన్ మాధవ్ ఎన్నిక తర్వాత నాయకులు నేరుగా ఆయన వద్దే ప్రస్తావించారు.

గత ఎన్నికలకు ముందు నుంచే రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి కూటమి ప్రభుత్వంలో తన లాబీయింగ్ ఉపయోగించి పార్టీ నాయకులకు పదవులు ఇప్పించడంలో విఫలమయ్యారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఆమె హయాంలో కేవలం కూటమి పార్టీల్లో ఒకటైన బీజేపీకి కేవలం 5 శాతం పదవులు మాత్రమే దక్కాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి కారణం ఆమె తన బావ అయిన చంద్రబాబు వద్ద అనుకున్న స్ధాయిలో లాబీయింగ్ చేయకుండా రాజీ పడ్డారనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఆమె స్ధానంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మాధవ్ పై నేతల్లో భారీ అంచనాలున్నాయి.

అయితే పురందేశ్వరి వల్లే కానిది పీవీఎన్ మాధవ్ సాధిస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది. దీనికి కారణం పురందేశ్వరితో పోలిస్తే సౌమ్యుడిగా పేరున్న మాధవ్ మాట విని బీజేపీ నేతలకు పదవుల విషయంలో చంద్రబాబు న్యాయం చేస్తారా అనేదే ఇక్కడ ప్రశ్న. దీంతో పురందేశ్వరి ఉన్నప్పుడు లభించిన స్దాయిలో అయినా పదవులు వస్తాయా లేదా అన్న మరో ఆందోళన కూడా నేతల్లో కనిపిస్తోంది. ఏదేమైనా మాధవ్ దూకుడుగా రాజకీయాలు చేయగలిగితేనే కూటమిలో అయినా, రాష్ట్రంలో అయినా పార్టీకి మనుగడ ఉంటుందనేది బీజేపీ నాయకుల మాట.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications