ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని గోకుతున్నారు: అమరావతి రాజధానికి..కమలానందభారతి మద్దతు
రాజధానికి శంకుస్థాపన జరిగినరోజే అమరావతి ప్రాంతంలో అమరాంబికా పరమేశ్వరి అమ్మవారు వెలిసినట్లుగా భావించాలని, రాజధాని నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోలేరని హిందూ దేవాలయ ప్రతిష్టాన్ పీఠాధిపతి కమలానంద భారతి అన్నారు. రాజధాని ప్రాంతంలో నిరసనలు చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించిన ఆయన ప్రస్తుత ప్రభుత్వంపై పరోక్షంగా పలు కామెంట్లు చేశారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని కావాలని గోకుతున్నారని, ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతున్నదని మండిపడ్డారు.

రాజకీయ భవిష్యత్తు ఉండదు..
2014 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కొంతమందికి రాజకీయ భవిష్యత్తు లేకుండాపోయిందని, ఇప్పుడు అమరావతి జోలికి వస్తున్నవాళ్లకు కూడా రాబోయేరోజుల్లో రాజకీయ భవిష్యత్తు ఉండదని కమలానంద హెచ్చరించారు. ఒకరు కోరితే అమరావతి సంకల్పం జరగలదేలని, ఒకరు వద్దనుకున్నంతమాత్రాన అది ఆగిపోదని, దైవ నిర్ణయం కాబట్టే రాజధాని నిర్మాణం జరిగితీరుతుందని చెప్పారు. సెంటిమెంట్లతో ఆడుకోకుండా, వాటిని పాటిస్తే అందరికీ మంచి జరుగుతుందన్నారు.

ఉద్యమాన్ని విస్తరించండి..
రాజధాని అమరావతిలోనే ఉండాలన్న ఉద్యమం ప్రస్తుతానికి 29 గ్రామాల్లోనే జరుగుతున్నదని, దీన్ని ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తేనే ప్రజాబలం పెరుగుతుందని నిరసనకారులకు కమలానందభారతి సూచించారు. రాజధాని ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో అమ్మవార్లకు పూజలు జరపాలని కోరారు. వచ్చే పదేండ్లలో అమరావతి నిర్మాణం పూర్తవుతుందని భరోసా ఇచ్చారు.

పలు చోట్ల నిరసలు
ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ భూములిచ్చిన రైతులు భారీ ఎత్తున నిరసనలు చేస్తున్నారు. సీఎం జగన్ తన ఇష్టానికి రాజధానుల్ని పెడతానంటూ ప్రజలు సహించబోరని ప్రతిపక్ష టీడీపీ నేతలు హెచ్చరించారు. రాజధాని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.
-
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
Amaravati: అమరావతికి కేంద్రం మరో గిఫ్ట్-బిల్లు ఆమోదించిన 24 గంటల్లో..! -
Mavigun Vs Amaravati: అమరావతి కంటే మావిగాన్ ఎలా బెటర్ ? అంబటి వివరణ..! -
జగన్ కు 'మావిగన్' సలహా ఆయనదే, అసలు టార్గెట్..!! -
సాయిరెడ్డి తాజా సంకేతాలు, తెర వెనుక..!? -
శూన్యం నుంచి సృష్టి వరకు.. చరిత్ర నిన్ను క్షమించదు జగన్ -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం..












Click it and Unblock the Notifications